Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అవి ఉంటేనే మనల్ని గుర్తిస్తారు.. పాయల్ రాజ్పుత్ పోస్ట్ వైరల్
పాయల్ రాజ్పుత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆర్ఎక్స్ 100 సినిమాలో ఇందు పాత్రలో జీవించి టాలీవుడ్ను షేక్ చేసింది. తెలుగులో మొదటి సినిమాతోనే అందర్నీ కట్టిపడేసింది. ఆ ఒక్క చిత్రంతో పాయల్ తెలుగు నాట జెండాను పాతింది. అయితే మళ్లీ ఆ రేంజ్లో సక్సెస్ను చూడలేకపోతోంది. స్టార్ హీరోల సరసన అవకాశం వచ్చినా అవి ఏ మాత్రం ఉపయోగపడ లేకపోయాయి. డిస్కోరాజా, వెంకీమామ వంటి చిత్రాలు ఆమె సినీ కెరీర్కు ఏమాత్రం బూస్ట్నివ్వలేదు.
స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఆమెకు మాత్రం పేరు రాలేదు. ఇక మరో రెండు మూడు ప్రాజెక్ట్లు ఆమె చేతిలో ఉన్నాయి. అందులో ఓ పోలీస్ ఆఫీసర్గా ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రం రాబోతోంది. అయితే లాక్ డౌన్ అనేది ఉండకపోతే పాయల్ తన సినిమాలతో సందడి చేసేది. దాదాపు వంద రోజులుగా సినీ పరిశ్రమ అంతా మూతపడటంతో అన్నీ తారుమారయ్యాయి. అయితే పాయల్ ఏ మాత్రం ఖాళీగా లేదు. తన ఫ్యాన్స్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.
కొత్త కొత్త ఛాలెంజ్లు, భిన్నమైన క్యాస్టూమ్స్తో పాయల్ నానా హంగామా చేసింది. లాక్ డౌన్లో పాయల్ వింత వింత డ్రెస్సులను ధరించింది. పిల్లో డ్రెస్, పేపర్ డ్రెస్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా పాయల్ షేర్ చేసిన ఓ పోస్ట్ అందర్నీ ఆలోచించేలా చేస్తోంది. ప్రెట్టీ, క్యూట్, ప్రతిభ, ఫేమస్, ధనవంతులు లేదా చనిపోతేనే ఓ మనిషిని సమాజం గుర్తిస్తుందని చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ను చూస్తే సుశాంత్ సింగ్ను ఉద్దేశించి, ఆ ఘటనకు ప్రజలు రియాక్ట్ అవ్వడంపైనే పాయల్ ఇలా కామెంట్ చేసినట్టు అనిపిస్తోంది.