Pooja Hegde ఫస్ట్ కంటే.. రెండో రౌండ్ అదిరింది... షాకింగ్గా పూజా హెగ్డే పోస్ట్!
పూజా హెగ్డే సినీ ప్రేమికులకు పరిచయం అవసరం లేని పేరు. ఒక లైలా కోసం అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఉన్నటువంటి ఈమెకు అల్లు అర్జున్ హీరోగా నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తెలుగులో ఈమె అరవింద సమేత అలా వైకుంఠపురం వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి సక్సెస్ అయ్యారు.
ఇలా వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో దూసుకుపోయినటువంటి పూజా హెగ్డేకు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె కెరియర్ ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూజ హెగ్డేకు పెద్దగా సినిమా అవకాశాలు లేవనే చెప్పాలి.

ఇటీవల ఈమె కమిట్ అయిన సినిమాలు కూడా కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడటం లేదంటే ఈమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలా సినిమా అవకాశాలు లేకపోవడంతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా పూజా హెగ్డే షేర్ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఈమె ఇటీవల డ్యూన్ (Dune) పార్ట్ 2 సినిమాని చూస్తున్నారని చెప్పకనే చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సెకండ్ రౌండ్ ఎపిక్ ఎపిక్ అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి Dune మూవీ గతంలో పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయింది అయితే తాజాగా ఈ సినిమా రెండో భాగం విడుదల కావడంతో పూజ హెగ్డే ఈ రెండో భాగాన్ని కూడా ఇదివరకే చూసినప్పటికీ మరోసారి చూస్తున్నారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రౌండ్ 2 అంటూ పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











