Don't Miss!
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రాధేశ్యామ్ షూటింగ్లో భయం భయంగా.. అసలు విషయాన్ని బయటపెట్టిన పూజా హెగ్డే
ప్రభాస్ - పూజా హెగ్డే మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సాహో అనంతరం ప్రభాస్ నుంచి ఎలాగైనా ఒక మంచి సినిమా రావాలని అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే సినిమా షూటింగ్ అయిపోయేది. ఇక ఫైనల్ గా ఇటీవల ఇటలీ వెళ్లిన చిత్ర యూనిట్ వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు.
ఇక షూటింగ్ జరుగుతున్న విధానంపై హీరోయిన్ పూజా హెగ్డే ఇటీవల స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇటలీలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మొదటి రెండు రోజులు చాలా భయం భయంగా షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్ ని అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతున్నాం. ఇటలీలో ఒక చిన్న సెట్ కూడా వేయడం జరిగింది. చాలా తక్కువ మంది టీమ్ సభ్యులతో మాత్రమే షూట్ చేస్తున్నారు.
ఇక సెట్ కి వెళ్లే ముందు ఎవరైనా సరే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. మొదట్లో భయంగా అనిపించినా ఆ తరువాత అలవటయ్యింది. ఇక సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నానని వస్తున్న రూమర్స్ లో నిజం లేదు. పురాణాల్లోని రాధ పాత్ర చేస్తున్నట్లు కూడా టాక్ వచ్చింది. అది నిజం కాదు కానీ.. హిస్టారిలోని గొప్ప ప్రేమికులు మాకు స్ఫూర్తి అనే విధంగా ఆ పాత్రలు ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరవుతాయి. ఈ సినిమా ద్వారా నాలోని టేలెంట్ ని మరింత బయటపెట్టేందుకు అవకాశం వచ్చింది.. అనుకుంటున్నానని పూజా హెగ్డే వివరణ ఇచ్చింది.