Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అక్కడ ప్రభాస్ ఒక్కడే నాతో ఉంటేనా! రెబల్ స్టార్ మాయలో పూజా హెగ్డే.. షాకింగ్ కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయిన ఈ హీరో అంటే యంగ్ హీరోయిన్స్ పడి చస్తుంటారు. పైగా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కదా! అందుకే హీరోయిన్ల కన్నంతా ఆయనపైనే ఉంటుంది. మరోవైపు తనతో తెరపంచుకునే హీరోయిన్ విషయంలో ప్రభాస్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ ఉంటారట. ఈ సంగతి ఇప్పటికే అనుష్క, శ్రద్ద కపూర్ కన్ఫర్మ్ చేశారు. తాజాగా పూజా హెగ్డే కూడా అదే మాట చెబుతోంది. ఇంతకీ ఏంటా సంగతి? వివరాల్లోకి పోతే..
Recommended Video
ప్రభాస్తో పూజా హెగ్డే రొమాన్స్
ప్రస్తుతం ప్రభాస్తో జోడీ కట్టి 'జాన్' సెట్స్పై అతనితో రొమాన్స్ చేస్తోంది పూజా హెగ్డే. ఈ ఇద్దరి జోడీపై ఓ రేంజ్ రొమాంటిక్ సీన్స్ షూట్ చేస్తున్నారట డైరెక్టర్ రాధాకృష్ణ. అయితే తాజాగా తన పట్ల, తమ యూనిట్ పట్ల ప్రభాస్ తీసుకునే శ్రద్ద, ఆయన ఇచ్చే ఆతిధ్యం గురించి చెబుతూ ప్రభాస్తో ఊహల్లో తేలిపోయింది పూజా.
సాహో టైమ్లో శ్రద్ధ కపూర్
ప్రభాస్ ఆతిథ్యం గురించి తెలిస్తే వారెవరైనా సాహో అనాల్సిందే. ముఖ్యంగా హీరోయిన్లు ప్రభాస్ అరేంజ్ చేసే ఫుడ్, ఆతిథ్యం చూసి ఫిదా అవుతుంటారు. గతంలో సాహో సెట్స్లో శ్రద్ధ కపూర్కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు ప్రభాస్. ఆయన తెచ్చిన క్యారేజీలో వంటకాల జాబితా చూసి ఆమె కళ్లు తేలేసిందని వార్తలొచ్చాయి.
అంతకుముందు కాజల్, అనుష్క.. ఇప్పుడు
సెట్స్లో అందరికీ కోరుకున్న ఫుడ్ అరేంజ్ చేయడంలో ప్రభాస్ని మించిన హీరోనే లేడంటారు యంగ్ హీరోయిన్స్. అంతకుముందు కాజల్, అనుష్క కూడా ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం చూసి ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు 'జాన్' సెట్స్పై ఉన్న పూజా హెగ్డే పరిస్థితి కూడా అదేనట. ఈ విషయం ఆమె స్వయంగా చెబుతోంది.
నాతో ప్రభాస్ ఒక్కడే ఉంటేనా.. పూజా ఫ్లాట్
'జాన్' సెట్స్ పైకి ప్రభాస్ సప్లై చేస్తున్న లంచ్ బాక్స్ మెనూ చూస్తే తనతో పాటు యూనిట్ అంతా కోమాలోకి వెళ్లిపోవాల్సిందే అంటోంది పూజా. ఏదైనా ద్వీపానికి వెళ్లిపోతే అక్కడ నాతో ప్రభాస్ ఉంటే ఎంత బావుంటుందో అనేసింది ఈ యంగ్ హీరోయిన్. ముఖ్యంగా ప్రభాస్కు నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టమని, సెట్స్లో ప్రభాస్తో కలిసి ఎంచక్కా బిర్యానీ తింటూ ఉంటానని చెప్పుకొచ్చింది.
యూవీ క్రియేషన్స్ బ్యానర్.. జాన్ బడ్జెట్
యూవీ క్రియేషన్స్, గోపి కృష్ణా మూవీస్ సంస్థలు 'జాన్' సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి దాదాపుగా 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. 1960 కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.