Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘రాధే శ్యామ్’ సీక్రెట్ లీక్ చేసిన పూజా హెగ్డే: ఇప్పుడు చెప్పను అంటూనే ఇలా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం 'రాధే శ్యామ్'. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాను జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం పూర్తి కాలేదు. ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ మొదలైంది. ఇందులో హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె పార్ట్ షూటింగ్ పూర్తైంది. ఈ నేపథ్యంలో తాజాగా బుట్టబొమ్మ ఈ మూవీకి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించింది.
తాజాగా పూజా హెగ్డే ఓ ప్రముఖ మీడియాతో చిట్ చాట్ చేసింది. ఇందులో భాగంగా తన సినిమాల గురించి పలు విషయాలు వెల్లడించింది. అదే సమయంలో ప్రభాస్తో కలిసి చేస్తోన్న 'రాధే శ్యామ్' గురించి కూడా మాట్లాడింది. 'రాధే శ్యామ్ మూవీలో నా పార్ట్ షూటింగ్ పూర్తైంది. మరో పది రోజుల్లో టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది రొమాంటిక్గా సాగే సినిమా. ఇలాంటి పాత్రను నేనెప్పుడూ చేయలేదు. ఇది ఎంతో సాహసంతో కూడుకున్న కథ. దర్శకుడు చాలా చక్కగా డీల్ చేస్తున్నారు. ఇంక దీని గురించి అప్పుడే ఏమీ చెప్పలేను' అని తెలిసింది. తద్వారా ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
టాలీవుడ్ ఐటెం గర్ల్ గ్లామరస్ ఫొటోలు: లేటు వయసులోనూ ఘాటుగా.. ఇంటర్నెట్ను షేక్ చేసిన పిక్స్ ఇవే!
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్తో రూపొందుతోన్న 'రాధే శ్యామ్' షూటింగ్లో ప్రభాస్ త్వరలోనే పాల్గొనబోతున్నాడు. ఇందుకోసం హైదరాబాద్లోని ఓ స్టూడియోలో సెట్ వర్క్ కూడా రెడీగా ఉంది. ఇక, ఈ సినిమాలో అతడు కార్ల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను ఈ చిత్రాన్ని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మిస్తున్నారు. ఇది తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.