Don't Miss!
- News అచ్చెన్నాయుడు ప్రత్యర్ధికి ఊరట-పోటీ నుంచి తప్పుకున్న భార్య..!
- Sports ప్రశాంతంగా ఉన్నా.. ఇక చాలు- నరైన్ షాకింగ్ కామెంట్స్
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- Technology Android 15 Features ఆండ్రాయిడ్ 15 లో క్వారంటైన్ ఫీచర్.. ఎలా పనిచేస్తుంది.. ఏంటి ఉపయోగం..??
- Finance Amit Shah: ఆ కంపెనీల్లో అమిత్ షా పెట్టుబడులు.. హోం మంత్రి పోర్ట్ఫోలియోలో టాప్-10 స్టాక్స్ ఇవే
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
పూజా హెగ్డే బుగ్గ గిల్లిన అభిమాని.. నీ ప్రేమని నేను ఫీల్ అవుతున్నా!
Recommended Video
డీజే, అరవింద సమేత చిత్రాలతో పూజా హెగ్డే టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కుర్రకారు పూజా హెగ్డే క్యూట్ లుక్స్, అందాలకు ఫిదా అవుతున్నారు. పూజ హెగ్డే క్రేజ్ తో దర్శక నిర్మాతలు కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా పూజా హెగ్డేకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అరవింద సమేత
పూజా హెగ్డే గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో పూజ హెగ్డే పాత్ర కూడా కీలకమైనదే. అంతకు ముందు డీజే చిత్రంలో అందాల ఆరబోత చేసిన పూజా హెగ్డే.. అరవింద సమేతలో నటనతో ఆకట్టుకుంది.
బుగ్గ గిల్లిన అభిమాని
పూజా హెగ్డే బుగ్గని ఓ అభిమాని గిళ్లాడు. కానీ నిజంగా కాదు. అరవింద సమేత చిత్ర పోస్టర్ లో ఉన్న పూజా హెగ్డే బుగ్గని పట్టుకుని ఉన్న ఓ అభిమాని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఆనోటా ఈ నోటా చేరి పూజా హెగ్డేకు కూడా తెలిసింది. చాలా క్యూట్ గా ఉన్న ఈ ఫోటోపై పూజ హెగ్డే కూడా సరదాగా స్పందించింది. నీ ప్రేమ నాకు తెలుస్తోంది అంటూ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.
మహర్షి చిత్రంలో
కుర్రకారు పూజ హెగ్డే కోసం ఎలా పిచ్చెక్కి పోతున్నారో చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణ. పూజ హెగ్డే ప్రస్థుం సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ సరసన నటిస్తోంది. మహేష్ సరసన నటిస్తున్న మహర్షి చిత్రం చివరి దశకు చేరుకుంది. త్వరలో ఈ చిత్ర విడుదలకు సన్నాహకాలు చేస్తున్నారు. మరో వైపు ప్రభాస్ సరసన రాధాకృష్ణ దర్శత్వంలో నటిస్తున్న చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్లో కూడా
పూజా హెగ్డే బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే హౌస్ ఫుల్ 4 చిత్రంలో నటిస్తోంది. గతంలో హృతిక్ రోషన్ సరసన మొహంజదారో చిత్రంలో నటించినా విజయం సాధించలేదు. పూజ హెగ్డే ఒకలైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ముకుంద, సాక్ష్యం లాంటి చిత్రాల్లో నటించింది.