Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం.. ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో..
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న బ్యూటీ పూజా హెగ్డే. సినిమా సినిమాకు తన రేంజ్ ని పెంచుకుంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకుంటోంది. అయితే రీసెంట్ గా పూజా హెగ్డే ఒక ఎమోషనల్ పోస్ట్ తో అందరి హృదయాలని కదిలించింది. పూజకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా వారి ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక చాలా ఎమోషనల్ అయిన పూజ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది.
స్థాయికి రావడానికి కారణం
పూజా హెగ్డే హీరోయిన్ గా అగ్ర స్థాయికి చేరుకోవడానికి కేవలం ఆమె కష్టమే కారణం కాదు. వారి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా చాలానే ఉందట. చాలా సందర్భాల్లో పూజా తన కుటుంబ సభ్యుల గురించి చెప్పింది. ఇంట్లో ప్రతి ఒక్కరి నుంచి వచ్చిన సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని చాలా ఎమోషనల్ అవుతూ చెబుతుంటుంది.
ఆ సమయంలో ఫుల్ సపోర్ట్
కెరీర్ మొదట్లో వరుస అపజయాల కారణంగా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే కొంత ఇబ్బందులు పడింది. ఆ సమయంలోనే పూజకు ఇంట్లో వాళ్ల నుంచి చాలా సపోర్ట్ లభించింది. ఇక అందులో పేరెంట్స్ తో పాటు గ్రాండ్ మదర్ నుంచి కూడా ఆమెకు ఫుల్ సపోర్ట్ అయితే లభించింది.
పూజా హెగ్డే ఇంట్లో విషాదం
పూజకు ఆమె బామ్మ అంటే ఎంతో ఇష్టం. షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమెతో మాట్లాడనిది రోజు గడవదట పూజకు ఒక రోజులో వచ్చే మొదటి ఫోన్ కాల్ అలాగే చివరి ఫోన్ కాల్స్ లలో ఎక్కువగా బామ్మవే ఉంటాయట. అంతలా బాండింగ్ తో ఉండే ఆమె ఇటీవల కన్నుమూశారు. దీంతో ఒక్కసారిగా పూజా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మా మధ్య లేకపోయినా
ఇక హీరోయిన్ పూజా హెగ్డే కూడా బామ్మ ప్రాణాలు కోల్పోవడంతో ఎంతగానో వేదనకు గురయ్యింది. సోషల్ మీడియా ద్వారా పూజ ఒక వివరణ కూడా ఇచ్చింది. ఈ క్యూటిని మేము కోల్పోయాము. కష్టాలు ఎన్ని ఉన్నా కూడా నవ్వుతూనే ముందుకు సాగాలని ఆమె మాకు నేర్పింది. మా మధ్య లేకపోయినా కూడా నాతో ఎప్పుడు ఉంటుందని.. పూజ వివరణ ఇచ్చింది.
చేతిలో బిగ్ బడ్జెట్ సినిమాలు
ఇక నెక్స్ట్ పూజా హెగ్డే రాధే శ్యామ్ తో పాటు తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో రాబోతోంది. అలాగే మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో హౌజ్ ఫుల్ తో బాక్సాఫీస్ సక్సెస్ కొట్టిన పూజా ఆ తరువాత ఆఫర్స్ చాలానే వచ్చినా కథలు నచ్చక ఒప్పుకోలేదట. బాలీవుడ్ లో వీలైనంత వరకు మంచి పాత్రల్లో సక్సెస్ అవ్వాలని చూస్తోంది.