Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ హీరోతో నేను ఆడుకోలేదు.. అతనే ఆ రకంగా దెబ్బ తీశాడు.. పూజా హెగ్డే
అందాల భామ పూజా హెగ్డే వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. తెలుగు, హిందీ చిత్రాల్లో బిజీగా మారింది. డీజే, అరవింద సమేత సక్సెస్తో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకొన్నది. ప్రస్తుతం హిందీలో హౌస్ఫుల్ 4 చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్లో జరిగిన ఆసక్తికరమైన సంఘటనను ఈ సందర్భంగా షేర్ చేసుకొన్నారు. ఆమె ఏమన్నారంటే..
అక్షయ్ కుమార్తో నటించడం
అక్షయ్ కుమార్తో నటించడం చాలా క్రేజీగా ఉంది. సెట్లో అక్షయ్ ఉంటే చాలా ఫన్గా సందడిగా ఉంటుంది. చాలా హ్యపీగా షూటింగ్ జరిగింది. చాలా బాగా నవ్విస్తాడు. చాలా కలుపుగోలుగా ఉంటాడు అని పూజా హెగ్డే తెలిపింది.
చిన్న పిల్లల మనస్తత్వం
ప్రొఫెషనల్గానే కాకుండా, వ్యక్తిగతంగా కూడా అక్షయ్ చాలా మంచివాడు. చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న వ్యక్తి. షూటింగ్ గ్యాప్లో మార్షల్ ఆర్ట్స్ చిట్కాలు చెబుతుంటాడు. సీన్ను ఇంప్రూవ్ చేసే విధానం బాగా నచ్చుతుంది అని పూజా హెగ్డే వెల్లడించింది.
లుడో గేమ్ అంటే ఇష్టం
అక్షయ్ కుమార్కు లుడో గేమ్ అంటే ఇష్టం. నేను ఎప్పుడూ అతడితో ఆట ఆడవద్దని నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే ఎప్పుడు ఆడినా అతనే గెలుస్తుంటాడు. సాధారణంగా ఇతరులతో ఆడితే నేను గెలుస్తాను. నా కాన్ఫిడెన్స్ను అక్షయ్ దెబ్బ తీశాడు అని పూజా హెగ్డే పేర్కొన్నది.
ప్రిన్స్ మహేష్బాబుతో కలిసి
అరవింద సమేత చిత్ర తర్వాత పూజా హెగ్డే తెలుగులో మహర్షి చిత్రంలో నటిస్తున్నది. అంతేకాకుండా సాహో చిత్రం తర్వాత రూపొందే చిత్రంలో ప్రభాస్తో కలిసి నటించనున్నది. రంగస్థలం చిత్రంలో స్పెషల్ పాటలో నర్తించిన పూజా మంచి క్రేజ్ లభించింది.
రోబోలో విలన్గా అక్షయ్ కుమార్
ఇదిలా ఉండగా, అక్షయ్ కుమార్ తొలిసారి దక్షిణాది సినిమాలో నటిస్తున్నాడు. ఆయన నటించిన 2.0 చిత్రం నవంబర్ 29న రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో మొదటిసారి విలన్గా కనిపించనున్నాడు. రజనీకాంత్, అమీ జాక్సన్ నటించిన ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.