పబ్లిక్గా చీర్స్ కొట్టిన పూజా హెగ్డే.. బుట్టబొమ్మకు ఇష్టమైన డ్రింక్ ఏమిటో తెలుసా!
టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరంటే అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇటీవల పూజా నటించిన చిత్రాలు ప్రేక్షకులను ఆలరించడం పక్కన పెడితే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు ఆమె గ్లామర్ స్టామినాను తెలియజేశాయి. తాజాగా ఎయిర్పోర్టులో ఆమె చేసిన సందడి గురించి వివరాలు మీ కోసం...

హిందీ, తెలుగులో బిజీ బీజీగా
ఇటీవల కాలంలో అటు బాలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్లోను పూజా హెగ్డే తన సినిమాలతో మోత మోగిస్తున్నది. అల వైకుంఠపురం సినిమా తర్వాత మరో భారీ రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉండగా.. హిందీలోనూ అంతే బిజీగా ఉన్నారు.

ముంబై, హైదరాబాద్కు చక్కర్లు
ముంబైకి, హైదరాబాద్కు చక్కర్లు కొడుతూ సినిమా షూటింగులో పాల్గొంటున్నారు. హైదరాబాద్లో రాధే శ్యామ్ షూటింగు కోసం వస్తూ ఈ బ్యూటీ ముంబై ఎయిర్పోర్టులో కాసేపు చిక్కుకొన్నారు. దాంతో ఏం చేయాలో తోయక తనకు ఇష్టమైన డ్రింక్ను ఆస్వాదిస్తూ పూజా హెగ్డే ఫోజిచ్చారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నది.

ఇష్టమైన డ్రింక్తో కెమెరాకు ఫోజు
ముంబై ఎయిర్పోర్టులో తాను ప్రయాణించ వల్సిన విమానం ఆలస్యం కావడంతో షాపింగ్ మాల్స్పై కన్నేశారు. అదే జోష్లో తనకు తనకు ఇష్టమైన లెమెండ్ రన్ అనే డ్రింక్ను ఆస్వాదిస్తూ కెమెరాకు చీర్స్ కొట్టారు. తాపీగా ఎయిర్పోర్టులో డ్రింక్ తాగుతూ.. నా ఫ్లయిట్ ఆలస్యం కావడంతో కాస్త సమయం దక్కింది. అందుకే నాకు ఇష్టమైన డ్రింక్ సేవిస్తున్నాను అంటూ ఇన్స్టాగ్రామ్ను అప్డేట్ చేసింది.
Recommended Video

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కోసం వెయిటింగ్
ఇదిలా ఉండగా, అఖిల్ అక్కినేనితో కలిసి పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 19, 2021న రిలీజ్ కానున్నది.

2021లో పూజా హెగ్డే కెరీర్
ఇక పూజా హెగ్డే కెరీర్ విషయానికి వస్తే.. ఆచార్య చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇక బాలీవుడ్లో సర్కస్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా టాలీవుడ్, బాలీవుడ్లో పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











