Don't Miss!
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రభాస్ 20 కథ వినగానే పిచ్చెక్కిపోయింది.. అది ఒక ఛాలెంజ్, హీరోయిన్ క్రేజీగా!
Recommended Video
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత జోరు పెంచాడు. బాహుబలి పూర్తి కాగానే సాహో చిత్రాన్ని ప్రభాస్ ప్రారంభించాడు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే ప్రభాస్ తన 20వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు. కానీ బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఎదురుచూపులు తప్పడం లేదు. సాహూ భారీ బడ్జెట్, కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతుండడంతో షూటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా డీజే చిత్రంతో అందాల సంచలనం రేపిన పూజా హెగ్డే ప్రభాస్ 20లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం గురించి పూజా హెగ్డే చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
టైటిల్ ఇంకా ఖరారు కాలేదు
ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సంధానం ఇచ్చింది. మీరు నటించే ప్రభాస్ సినిమా టైటిల్ ఏంటని అభిమానులు అడిగారు. రెండు మూడు ఆసక్తికరమైన టైటిల్ పరిశీలిస్తున్నారు. ఫైనల్ చేయగానే మీకు చెబుతాను అని పూజా హెగ్డే తెపిపింది. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. 1960 పరిస్థితుల్లో అద్భుతమైన ప్రేమ కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
వినగానే పిచ్చెక్కిపోయింది
పూజ హెగ్డే ఈ చిత్ర కథ గురించి చెబుతూ.. తాను ఇంతవరకు ఇలాంటి చిత్రంలో నటించలేద్దు అని తెలిపింది. అద్భుతమైనా కథ. దర్శకుడు నాకు స్క్రిప్ట్ వినిపించగానే నా మతిపోయింది. ఈ చిత్రంలో నా రోల్ అంత ఈజీగా చేసేది కాదు. చాలా చాలెంజింగ్ గా ఉంటుంది అని పూజ ప్రభాస్ 20 గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక అద్భుతమైన చిత్రం అవుతుందని మాత్రం హామీ ఇస్తున్నట్లు పూజా తెలిపింది.
మహర్షిలో నా పాత్ర
పూజ
హెగ్డే
నటిస్తోన్న
మరో
బిగ్
ప్రాజెక్ట్
సూపర్
స్టార్
మహేష్
మహర్షి
చిత్రం.
ఈ
చిత్రంలో
కూడా
పూజానే
హీరోయిన్.
తాను
ఈ
చిత్రంలో
అల్లరి
పిల్లగా,
చిన్న
టౌన్
నుంచి
వచ్చిన
యువతిగా
నటిస్తున్నానని
తెలిపింది.
వంశీ
పైడిపల్లి
దర్శత్వంలో
తెరకెక్కుతున్న
ఈ
చిత్రం
ఏప్రిల్
25న
ప్రేక్షకుల
ముందుకు
రానున్న
సంగతి
తెలిసిందే.
మహేష్
ఈ
చిత్రంలో
కార్పొరేట్
సంస్థ
సీఈవోగా
నటిస్తున్నాడు.
వరుసగా స్టార్ హీరోలతో
పూజా హెగ్డేకి ప్రస్తుతం టాలీవుడ్ లో దక్కుతున్న అవకాశాలన్నీ పెద్ద హీరోలతోనే. డీజే చిత్రంలో అందాల ఆరబోత తర్వాత పూజ హెగ్డేకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఆ తర్వాత అరవింద సమేత చిత్రంలో, ప్రస్తుతం మహర్షి, ప్రభాస్ 20 చిత్రాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. పూజా హెగ్డే కెరీర్ ఆరంభంలో ఒక లైలా కోసం, ముకుంద లాంటి చిత్రాల్లో నటించినా పెద్ద గుర్తింపు రాలేదు