Don't Miss!
- News మైసూరు మహారాజుకు లేఖ రాసిన మోదీ, మీరు కచ్చితంగా వస్తారని ఎదురుచూస్తున్నా, ఆ సీటు మీదే !
- Finance Gold Rate: గుడ్న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
అది మాత్రం ఫుల్లుగా ఉంది.. కానీ ఎక్కడికీ వెళ్లలేనంటోన్న పూజా హెగ్డే
కరోనా దెబ్బకు సాధారణ ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. కరోనా వ్యాప్తి చెందుకుండా ఉండేందుకు అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వాలు సూచించడం తెలిసిందే. అందుకే ఎంతో బిజీగా ఉండే హీరో, హీరోయిన్లు సైతం ఇంట్లో ఖాళీగా కూర్చున్నారు. అయితే అక్కడ సమయాన్ని వృథా చేయకుండా వర్కౌట్లు చేసుకుంటూ సమయాన్ని గడిపేస్తున్నారు.
రకుల్ ప్రీత్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ ఇంట్లోనూ వ్యాయామాలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. బయటకు వెళితే ఎక్కడ కరోనా సోకుతుందో అని బయపడి పోతున్నారు. కరోనాను కట్టడి చేసే భాగంలోనే టాలీవుడ్ మొత్తం మూగబోయింది. అన్ని షూటింగ్స్ను రద్దు చేయాలని చిత్రసీమ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించరాదని తెలిపింది.
తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన పిక్స్, కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. 'ఫ్యూయెల్ మాత్రం బాగానే నిండి ఉంది.. కానీ ఎక్కడికి వెళ్లలేను.. ఇంట్టోనే ఉండండి.. సురక్షితంగా ఉండండి.. కరోనా సమయంలో జీవితం ఇలానే ఉంటుంద'ని పోస్ట్ చేసింది. రీసెంట్గా జార్జియా నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ మూవీ షూటింగ్ పూర్తి కావడంతో ఇండియాకు వచ్చిన పూజా విరామం తీసుకుంటుంది.