పూనమ్ కౌర్కు అరుదైన వ్యాధి.. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా.. కానీ!
టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. అయితే కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపుడుతున్నారు. ఇటీవల చేనేతకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో పూనమ్కు పరీక్షలు జరిపించారు. అయితే పూనమ్ కౌర్కు సంబంధించిన వ్యాధి వివరాల్లోకి వెళితే..

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో
పూనమ్ కౌర్ ఇటీవల కాలంలో చేనేతకు సంబంధించిన పలు సమస్యలను రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వాలకు విన్నపాలు సమర్పిస్తూ చేనేత పరిశ్రమకు అండగా నిలువాలని కోరుకొంటున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసి చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వాలకు సూచించాలని పూనమ్ కౌర్ చెప్పారు.

ఫైబ్రోమీయాల్జీయాతో బాధపడుతున్నట్టు..
వైద్య నిపుణులు చెప్పిన ప్రకారం.. పూనమ్ కౌర్ ప్రస్తుతం ఫైబ్రోమీయాల్జీయా అనే వ్యాధితో బాధపడుతున్నది. అయితే తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమె కేరళకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు జరిపించుకొన్నారు. ఆ సమయంలోనే వైద్యులు ఫైబ్రోమీయాల్జీయా ఉందని నిర్ధారించారు. దాంతో ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ ప్రారంభించారు అని సన్నిహితులు తెలిపారు.

ఫైబ్రోమీయాల్జీయా వ్యాధి లక్షణాలు..
పూనమ్ కౌర్కు ఎదురైన వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే.. అలసత్వం, నిద్ర, జాపకశక్తి, బిహేవియర్లో మార్పులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందు కోసం మెరుగైన జీవనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ప్రతీ రోజు వ్యాయామం, సరైన మందులు వాడుతూ.. చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఇలాంటి వ్యాధిగ్రస్థులకు చాలా అవసరం అని వైద్యులు తెలిపారు.

ఫైబ్రోమీయాల్జీయా చికిత్స ఏమిటంటే?
ఫైబ్రోమయాల్జియా కండరాలకు సంబంధించిన వ్యాధి. ఈ వ్యాధికి గురైన వారికి మెదడు, వెన్నుముకలో తీవ్ర నొప్పితో బాధపడుతారు. శారీరకంగా ఎక్కువ సమస్యలు వస్తాయి. కీళ్లలో విపరీతమైన నొప్పి.. తీవ్రమైన నొప్పితో బాధపడుతారు. మానసిక ప్రశాంతత ఈ వ్యాధి నుంచి బయటపడేలా చేస్తుంది అని వైద్య నిపుణులు తెలిపారు.

సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష తర్వాత అంటూ
పూనమ్ కౌర్ వ్యాధి గురించి చేనేత నేత యర్రమాద వెంకన్న మాట్లాడుతూ.. గతేడాది కాలంగా జీరో జీఎస్టీ ఉద్యమంలో పూనమ్ కౌర్ పాల్గొంటున్నారు. నవంబర్ 10వ తేదీన సూరత్లోని గాంధీ పార్కులో చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలనే కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. నవంబర్ 11వ తేదీన సబర్మతి ఆశ్రమంలో మౌన దీక్ష చేశారు. 12వ తేదీన బ్రహ్మకుమారి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆమె తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడ్డారు. దాంతో చికిత్స కోసం ఆమె కేరళకు వెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. 18వ తేదీన ప్రైబ్రోమయాల్జియా వ్యాధి నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గానే ఉంది.. కాకపోతే కాస్త నిలకడగా ఉండటం ఉపశమనం అంతేకాకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆమె ఉన్నారు అని చెప్పారు.


Click it and Unblock the Notifications











