Don't Miss!
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- News కడప కోర్టు ఆంక్షలపై హైకోర్టుకు సునీత..! వైసీపీపై కీలక వ్యాఖ్యలు..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
అది జరిగినప్పుడు నేను పుట్టనే లేదు.. రామ్ మందిర్ భూమి పూజపై ప్రణీత ఎమోషనల్
ఎన్నో యేళ్ల కలల సాకారం, ఎన్నో యేళ్ల పోరాటం నేటికి ఫలించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సర్వం సిద్దమైంది. రాముని జన్మ స్థలంలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా నవ నిర్మాణాన్ని చేపట్టబోతోన్నారు. నేడు రామ మందిరాని భూమి పూజ జరుగుతోంది. ఈ వేడుకను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆనందంతో వీక్షిస్తున్నాయి. నేడు ప్రధాని మోడీ నిర్మాణాన్ని మొదలు పెడతారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలు మహదానందంగా వీక్షిస్తున్నారు.
అయోధ్యలో రాముని గుడి కట్టాలన్నిది యేళ్లనాటి సంకల్పం. దీనికి ముందడుగు నాడు అద్వాణీ చేపట్టిన రథయాత్రతో పడింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లు, గొడవలు అందరికీ తెలిసిందే. అనేక వాదోపవాదాల తరువాత నేటికి రాముని గుడి కట్టేందుకు అన్ని అవాంతరాలు తొలిగిపోయాయి. ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాముని గుడిని అద్భుతంగా నిర్మించబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రణీత ఎమోషనల్ అయింది.
ప్రణీత అయోధ్య రామ మందిర భూమిపూజ కార్యక్రమంపై స్పందిస్తూ.. 'హిందువులనందరినీ ఏకం చేసేందుకు చేపట్టిన రథ యాత్ర జరిగినప్పుడు నేను ఇంకా పుట్టనే లేదు. కానీ ఇప్పుడు ఓ ధార్మిక హిందువునని చెప్పుకునే గుర్తింపు కలిగింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం వచ్చింది. మనం కోల్పోయిన వారసత్వ సంపదను మళ్లీ తిరిగి తీసుకు రావడంతో అద్భుతమైన అడుగు వేశాం. జై శ్రీరామ్' అంటూ ఎమోషనల్ అయింది.