Don't Miss!
- News మీ సేవలు చాలు ఇక- `అప్ప`ను పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ
- Sports IPL 2024: రాజస్థాన్ చేతిలో ఘోర పరాజయం.. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Technology Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
అది జరిగినప్పుడు నేను పుట్టనే లేదు.. రామ్ మందిర్ భూమి పూజపై ప్రణీత ఎమోషనల్
ఎన్నో యేళ్ల కలల సాకారం, ఎన్నో యేళ్ల పోరాటం నేటికి ఫలించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సర్వం సిద్దమైంది. రాముని జన్మ స్థలంలో ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా నవ నిర్మాణాన్ని చేపట్టబోతోన్నారు. నేడు రామ మందిరాని భూమి పూజ జరుగుతోంది. ఈ వేడుకను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆనందంతో వీక్షిస్తున్నాయి. నేడు ప్రధాని మోడీ నిర్మాణాన్ని మొదలు పెడతారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రజలు మహదానందంగా వీక్షిస్తున్నారు.
అయోధ్యలో రాముని గుడి కట్టాలన్నిది యేళ్లనాటి సంకల్పం. దీనికి ముందడుగు నాడు అద్వాణీ చేపట్టిన రథయాత్రతో పడింది. ఆ సమయంలో జరిగిన అల్లర్లు, గొడవలు అందరికీ తెలిసిందే. అనేక వాదోపవాదాల తరువాత నేటికి రాముని గుడి కట్టేందుకు అన్ని అవాంతరాలు తొలిగిపోయాయి. ప్రపంచం ఆశ్చర్యపోయేలా రాముని గుడిని అద్భుతంగా నిర్మించబోతోన్నారు. ఈ సందర్భంగా ప్రణీత ఎమోషనల్ అయింది.
ప్రణీత అయోధ్య రామ మందిర భూమిపూజ కార్యక్రమంపై స్పందిస్తూ.. 'హిందువులనందరినీ ఏకం చేసేందుకు చేపట్టిన రథ యాత్ర జరిగినప్పుడు నేను ఇంకా పుట్టనే లేదు. కానీ ఇప్పుడు ఓ ధార్మిక హిందువునని చెప్పుకునే గుర్తింపు కలిగింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఘట్టం వచ్చింది. మనం కోల్పోయిన వారసత్వ సంపదను మళ్లీ తిరిగి తీసుకు రావడంతో అద్భుతమైన అడుగు వేశాం. జై శ్రీరామ్' అంటూ ఎమోషనల్ అయింది.