ఇల్లీగల్ మ్యారేజ్ ఆరోపణలు.. ఎవరేమనుకున్నా సంబంధం లేదు... ప్రియమణి సంచలన వ్యాఖ్యలు!

సౌత్ నటి ప్రియామణి ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో ఆయన నటన చాలా ప్రశంసలు అందుకుంది. ఈ సమయంలో ప్రియమణి తన వ్యక్తిగత జీవితానికి కొన్ని ఆరోపణలతో వార్తల్లో నిలిచారు. ప్రియమణి ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోర్టులో సవాలు చేయబడింది. ఈ అంశం మీద ప్రియమణి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆ వివరాల్లోకి వెళితే

బాబోయ్ ఏంటా అందాలు: ఫిట్‌నెస్ మోడల్ అదితి మిస్త్రీ వైరల్ (ఫోటోలు)

 సంచలన వ్యాఖ్యలు

సంచలన వ్యాఖ్యలు

ప్రియమణి 2017 లో ముస్తఫాను వివాహం చేసుకుంది. ఇప్పుడు ముస్తఫా మొదటి భార్య ఆయేషా ప్రియామణి మరియు ముస్తఫా వివాహం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ముస్తఫా నుండి ఆయన మొదటి భార్య ఆయేషా 2013 సంవత్సరంలో విడిపోయింది. ఈ విషయంలో గురించి అయేషా ఒక జాతీయ పత్రికతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివాహం చట్టవిరుద్ధం

వివాహం చట్టవిరుద్ధం

ముస్తఫా మొదటి భార్య ఆయేషా మాట్లాడుతూ మేము ఇంకా వివాహం బంధంలోనే ఉన్నామని, ప్రియమణితో ఆయన వివాహం చట్టవిరుద్ధం అని పేర్కొంది. అయేషా మాట్లాడుతూ మేము ఇప్పటివరకు విడాకులు కూడా దాఖలు చేయలేదని అయినా అతను ప్రియమణిని వివాహం చేసుకున్నాడని, అతను బ్రహ్మచారి అని కోర్టుకు చెప్పాదని పేర్కొంది.

డబ్బు దోపిడీ చేసే ప్రయత్నం

డబ్బు దోపిడీ చేసే ప్రయత్నం

ప్రియమణి, ముస్తఫాల మీద ఆయేషా కేసు నమోదు చేసింది. దీంతో పాటు అయేషా ముస్తఫాపై గృహహింస కేసు కూడా నమోదు చేసింది. ముస్తఫా , ఆయేషా , ముస్తఫాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఈ ఆరోపణలపై ముస్తఫా స్పందిస్తూ, అతను పిల్లల సహాయాన్ని అందిస్తున్నందున ఇది నా డబ్బు దోపిడీ చేసే ప్రయత్నం అని పేర్కొన్నారు.

Leaked Shocking Pictures of Indian Celebs Photos

విడాకులు కూడా

విడాకులు కూడా

నాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధం. నేను ఆయేషాకు ప్రతిరోజూ పిల్లల కోసం డబ్బు ఇస్తున్నాను, ఆమె నా నుండి ఇంకేదో ఆశిస్తోంది అని పేర్కొన్నారు. తాను మరియు ఆయేషా 2010 నుండి విడివిడిగా జీవిస్తున్నామని, 2013 లో విడాకులు తీసుకున్నామని ముస్తఫా చెప్పారు. నేను 2017 సంవత్సరంలో ప్రియమణిని వివాహం చేసుకున్నాను, అప్పటి నుంచి ఆయేషా ఎందుకు మౌనంగా ఉండిపోయింది. అని ప్రశ్నించారు.

Photos: Actress Caught Smoking On & Off Screen

ఎవరేమనుకున్నా

ఎవరేమనుకున్నా

ఇక ప్రియమణి స్పందిస్తూ తమ బంధం చాలా సురక్షితమని అన్నారు. ఎవరేమనుకున్నా తమకు సంబంధం లేదని వెల్లడించింది. ప్రియమణి మాట్లాడుతూ "కమ్యూనికేషన్ కీలకం. నాకు, ముస్తఫా మధ్య ఉన్న సంబంధంలో మేము ఖచ్చితంగా చాలా సురక్షితంగా ఉన్నాము. ప్రస్తుతం అతను విదేశాల్లో పని చేస్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పటికీ మేము ప్రతిరోజూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటాము. అలా కుదరకపోతే 'హాయ్' లేదా 'హలో' అని మెసేజ్ అయినా పెట్టుకుంటామని అన్నారు.

ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా

ఫ్రీ అయ్యాక కాల్ చేస్తా

ఆయన పనిలో బిజీగా ఉంటే ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారు. లేదా టెక్స్ట్ చేస్తారు. నేను కూడా షూటింగ్ లో బిజీగా ఉంటే అలాగే చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. పలు అద్భుతమైన సినిమాల్లో నటించిన నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం నిజంగా ఆమె అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X