Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఈవెంట్కు వెళ్లి బలయ్యా.. హోటల్ గదిలో వాళ్లు నరకం చూపించారు: లక్ష్మీ రాయ్ షాకింగ్ కామెంట్స్
అప్పుడెప్పుడో తెలుగు సినిమాల్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయింది గ్లామరస్ బ్యూటీ రాయ్ లక్ష్మీ. టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత అంతగా గుర్తింపు దక్కకపోవడంతో ఇతర భాషల్లోకి చేసింది. అక్కడ పలు చిత్రాల్లో నటించిన తర్వాత అమ్మడి వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. దీంతో ఈ మధ్య ఎక్కువ ఈవెంట్ల ఆఫర్లు వస్తున్నాయి. ఇలా ఇటీవల ఓ ఈవెంట్కు వెళ్లగా.. తనకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది లక్ష్మి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
సారా ఆలీ ఖాన్ అందాల జిగేల్... మీరెప్పుడూ చూడని బాలీవుడ్ భామ పోటోలు
కేబుల్ టీవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ
హీరో శ్రీకాంత్ నటించిన 'కాంచనమాల కేబుల్ టీవీ' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రాయ్ లక్ష్మీ. ఈ సినిమాలో ఆమె చేసింది మంచి పాత్రే అయినా.. ఆ తర్వాత అంతగా ఆఫర్లు రాలేదు. అయితే, 'నీకు నాకు' అనే చిన్న సినిమా మాత్రమే చేసి.. టాలీవుడ్కు టాటా చెప్పేసింది. కానీ, దక్షిణాదిలోని మిగిలిన భాషల్లో వరుస పెట్టి చిత్రాలు చేసింది.
బాలీవుడ్లో సినిమాలు.. మారింది
టాలీవుడ్కు దూరం అయిన తర్వాత.. తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో సినిమాలు చేసింది రాయ్ లక్ష్మీ. అన్ని చోట్లా పలు హిట్లను తన ఖాతాలో వేసుకుని ఓ వెలుగు వెలిగింది. అదే సమయంలో 'అకీరా' అనే సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'జూలీ 2' అనే సినిమా చేసి అందాలను ఆరబోసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయిపోయింది.
మెగా హీరోలతో చిందులు.. రీఎంట్రీ
రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన 'బలుపు' అనే సినిమాలో స్పెషల్ సాంగ్తో చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది రాయ్ లక్ష్మీ. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ వెంటనే పవన్ కల్యాణ్ నటించిన 'సర్ధార్ గబ్బర్ సింగ్', మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లోనూ ఐటెం సాంగ్స్తో అదరగొట్టేసిందీ అందాల సుందరీమణి.
అక్కడ ఫుల్ బిజీ.. అందాల విందు
రాయ్ లక్ష్మీ సినిమా షూటింగ్లు ఉన్నా లేకున్నా చాలా రోజులుగా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ బిజీగా ఉంటోంది. ఇందులో తన కెరీర్ గురించిన విషయాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.
ఈవెంట్కు వెళ్లి బలయ్యానన్న లక్ష్మీ
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెప్పింది రాయ్ లక్ష్మీ. 'గత ఏడాది నోటి క్యాన్సర్ వల్ల నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిని అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే దుబాయ్లో జరిగిన ఓ ఈవెంట్కు హాజరయ్యా. కానీ, అప్పుడు కరోనా పాజిటివ్ రావడంతో బలైపోయా'నంటూ చెప్పుకొచ్చింది.
Recommended Video
హోటల్ గదిలో నరకం అనుభవించా
దీనిని కొనసాగిస్తూ.. 'కరోనా పాజిటివ్ రావడంతో హోటల్లో సెల్ఫ్ క్యారంటైన్లో ఉన్నా. హోటల్ వాళ్లు సరిగా పట్టించుకునే వాళ్లు కాదు. దీంతో చాలా డిప్రెషన్కు లోనయ్యాను. అప్పుడు ఒంటరిగా 12 రోజులు నరకం అనుభవించా' అంటూ తన అనుభవాన్ని వివరించింది రాయ్ లక్ష్మీ. ఇక, చివర్లో కరోనా వస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి.. అందరూ సురక్షితంగా ఉండాలని సూచించింది.