Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బుల్లితెర నటిగా రాశీ ఖన్నా: ఆ స్టార్ హీరో కోసమే ఈ నిర్ణయం
నాగశౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. నటనకు నటన, గ్లామర్కు గ్లామర్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్య వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఆమె.. గోపీచంద్ కొత్త సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
టాలెంటెడ్ స్టార్ గోపీచంద్ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న చిత్రం 'పక్కా కమర్షియల్'. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్గా ఎంపికైంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఆమె సీరియల్ హీరోయిన్గా కనిపించబోతుందట. తెలుగు బుల్లితెరపై వచ్చే ఓ ధారావాహికలో నటించే అమ్మాయిగా ఆమె ఫన్నీ పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో 'ప్రతి రోజూ పండగే' సినిమాలో ఏంజిల్ ఆర్నాగా మెప్పించిన ఈ సుందరాంగి.. ఇందులో అంతకు మించి నటించబోతుందని అంటున్నారు. మొత్తానికి మరో వైవిధ్యమైన పాత్రతో ప్రయోగం చేయబోతుందట రాశీ ఖాన్నా.
గోపీచంద్ కెరీర్లోనే ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'పక్కా కమర్షియల్'ను అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. హైదరాబాద్ యూసఫ్గూడాలో ఉన్న పోలీస్ క్వార్టర్స్లో చిత్రీకరణను మొదలు పెట్టారు. మొదటి రోజు హీరోపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచే మారుతి ఈ సినిమా మాత్రం సోషల్ మెసేజ్తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.