మళ్ళీ తెలుగులో బిజీ అవుతోన్న రాశి ఖన్నా.. ఆ బాధ పోయినట్లే?
సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలను దాటకుండా ఎవరు కూడా స్టార్ హోదాను అందుకోలేరు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి అంటే ఆడియెన్స్ ఊహలకు అందుకొని విధంగా కష్టపడాలి. అలాంటి తరహాలోనే సక్సెస్ అవ్వాలని గత కొంత కాలంగా రాశి ఖన్నా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అమ్మడి కెరీర్ ని ఉహీంచని విధంగా దెబ్బ కొట్టింది.
ఆ సినిమా కారణంగా చేతిలో ఉన్న కొన్ని సినిమాలు కూడా మిస్ అయ్యాయట. ఇక బాధతో ఒకసారి సోషల్ మీడియాలో సైతం వివరణ ఇచ్చింది. ఇక ఫైనల్ గా అమ్మడు ఆ బాధ నుంచి కొలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో రాశికి మళ్ళీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే రవితేజతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న అమ్మడు మరో రెండు సినిమాలు ఒప్పుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇక శర్వానంద్ తో కూడా త్వరలోనే జతకట్టబోతున్నట్లు సమాచారం. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించబోతున్న మహా సముద్రం కథకు ఆల్ మోస్ట్ శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక హీరోయిన్ విషయంలో ఇప్పటికే చాలా మందిని చూసిన దర్శకుడు ఫైనల్ గా రాశిఖన్నాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











