మరోసారి మంటపెట్టిన రాశీ ఖన్నా.. ఫోటో షూట్తో రచ్చ
రాశీ ఖన్నా ఈ మధ్య హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది. ఇంత వరకు రాశీ ఖన్నాను చూడని కోణంలో దర్శనమిస్తూ అందర్నీ షాక్కు గురి చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట్లో సెగలు రేపుతోంది. ఆ మధ్య సాగరకన్యలా మారి చేసిన ఫోటోషూట్లు, పదహరణాల తెలుగు అమ్మాయిలా కట్టూబొట్టూ పెట్టుకుని చేసిన ఫోటో షూట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రాశీ ఖన్నాకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. రాత్రి పూట కూడా షూటింగ్లతో బిజీ అయిపోయింది. పండుగ అని కూడా హాలీడే లేకుండా పని ధ్యాసలో పడిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో కోలీవుడ్కు చెందిన రెండు ప్రాజెక్ట్లున్నాయి. అందులో విజయ్ సేతుపతి తుగ్లక్ దర్భార్ ఒకటి. తెలుగులో మరో కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా ఓకే కాలేదు. అయితే రాశీ ఖన్నా ప్రస్తుతం చెన్నైని వీడింది.


చెన్నై నుంచి హైద్రాబాద్కు నిన్న వచ్చిన రాశీ ఖన్నా.. ఎయిర్ పోర్ట్లో బాగానే ఫోజులు ఇచ్చింది. అలా క్యాజువల్గా పోజిచ్చినా కూడా అవి బాగానే వైరల్ అయ్యాయి. ఆ తరువాత మళ్లీ వెంటనే ఫోటో షూట్తో రచ్చ చేసింది. ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించిన రాశీ ఖన్నా అందాలను ఆరబోసింది. ఎద అందాలతో ఎర వేస్తూనే బ్యాక్ మొత్తాన్నీ ఫ్రీగా వదిలేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











