Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరోసారి మంటపెట్టిన రాశీ ఖన్నా.. ఫోటో షూట్తో రచ్చ
రాశీ ఖన్నా ఈ మధ్య హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. కనీసం వారానికి ఒక్కసారైనా ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తోంది. ఇంత వరకు రాశీ ఖన్నాను చూడని కోణంలో దర్శనమిస్తూ అందర్నీ షాక్కు గురి చేస్తోంది. వరుస ఫోటో షూట్లతో నెట్టింట్లో సెగలు రేపుతోంది. ఆ మధ్య సాగరకన్యలా మారి చేసిన ఫోటోషూట్లు, పదహరణాల తెలుగు అమ్మాయిలా కట్టూబొట్టూ పెట్టుకుని చేసిన ఫోటో షూట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక రాశీ ఖన్నాకు క్షణం కూడా తీరిక లేకుండా పోయింది. రాత్రి పూట కూడా షూటింగ్లతో బిజీ అయిపోయింది. పండుగ అని కూడా హాలీడే లేకుండా పని ధ్యాసలో పడిపోయింది. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో కోలీవుడ్కు చెందిన రెండు ప్రాజెక్ట్లున్నాయి. అందులో విజయ్ సేతుపతి తుగ్లక్ దర్భార్ ఒకటి. తెలుగులో మరో కొత్త ప్రాజెక్ట్ ఏది కూడా ఓకే కాలేదు. అయితే రాశీ ఖన్నా ప్రస్తుతం చెన్నైని వీడింది.
చెన్నై నుంచి హైద్రాబాద్కు నిన్న వచ్చిన రాశీ ఖన్నా.. ఎయిర్ పోర్ట్లో బాగానే ఫోజులు ఇచ్చింది. అలా క్యాజువల్గా పోజిచ్చినా కూడా అవి బాగానే వైరల్ అయ్యాయి. ఆ తరువాత మళ్లీ వెంటనే ఫోటో షూట్తో రచ్చ చేసింది. ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించిన రాశీ ఖన్నా అందాలను ఆరబోసింది. ఎద అందాలతో ఎర వేస్తూనే బ్యాక్ మొత్తాన్నీ ఫ్రీగా వదిలేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.