Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మాజీ సీఎం భార్యకు టోకరా.. 3 కోట్ల చీటింగ్.. పోలీసులకు ఫిర్యాదు
కన్నడ నటి, మాజీ సీఎం కుమారస్వామి సతీమణి రాధిక కుమారస్వామికే ఓ వీడియో షేరింగ్ వెబ్సైట్ ఝలక్ ఇచ్చింది. తన అనుమతి లేకుండా తాను నటించిన చిత్రాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసిన విషయాన్ని తెలుకొన్న ఆమె భగ్గుమన్నారు. ఆ సదరు యూట్యూబ్ ఛానెల్పై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతకు తన సినిమా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
2013లో నటి రాధిక కుమారస్వామి
నటి రాధిక కుమారస్వామి 2013లో స్వీటీ నాన్న జోడి అనే చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం అదే సంవత్సరంలో థియేటర్లో రిలీజైంది. అయితే వాటికి సంబంధించిన డిజిటల్ హక్కుల తనతోనే ఉన్నాయి. దాదాపు 3 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ చిత్రాన్ని యూట్యూబ్ ఛానెల్ డైరెక్టుగా అప్లోడ్ చేయడం ఇటీవల ఆమె దృష్టికి వచ్చింది.
డైరెక్టుగా యూట్యూబ్లో అప్లోడ్
స్వీటీ నాన్న జోడి సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్లో రిలీజ్ చేయడంపై రాధిక కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమాపై దాదాపు 3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాం. అలాంటి చిత్రాన్ని ఓ వ్యక్తి అక్రమంగా, నా అనుమతి లేకుండా అప్లోడ్ చేస్తారు. ముమ్మాటికి ఇది చీటింగే అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు
స్వీటీ నాన్న జోడి సినిమాను అనుమతి లేకుండా అక్రమంగా యూట్యూబ్లో అప్ లోడ్ చేశారు అని ఉత్తర బెంగళూరులోని సీఈఎన్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. సైబర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మమల్ని చీటింగ్ చేశారు అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
రాధిక కమ్ బ్యాక్ చిత్రంగా, నిర్మాతగా మారి
స్వీటీ నాన్న జోడి చిత్రం ఓ రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కింది. ఆదిత్య అనే హీరోతో కలిసి నటించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత రాధికకు కమ్ బ్యాక్ చిత్రంగా మారింది. విజయలక్ష్మి సింగ్ దర్శకత్వం వహించగా, స్వయంగా రాధిక కుమారస్వామి నిర్మాతగా మారింది.
Recommended Video
రాధిక కుమారస్వామి కెరీర్ ఇలా
ఇక రాధిక కుమారస్వామి కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం అర్జున్ సర్జా నటించిన కాంట్రాక్టు అనే చిత్రంలో నటించారు. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం భైరాదేవి చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అలాగే లవ్ మాక్టెయిల్ దర్శకుడు డార్లింగ్ కృష్ణ రూపొందించే [email protected] సినిమా కోసం ఆమె సంప్రదించారు.