Don't Miss!
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఓటీటీలపై కన్నేసిన రకుల్... క్రిష్ సారధ్యం వెబ్ సిరీస్
పొడుగుకాళ్ల సుందరి రకుల్ ప్రీత్ సింగ్... లాక్ డౌన్ లోనూ చకచకా షూటింగ్ లు చేసేసుకుంటూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది. ఇటీవలే ముంబైలో ఓ షూటింగ్ పూర్తి చేసుకున్న రకుల్, మొత్తానికి చాలా రోజుల తరువాత హైదరాబాద్ వచ్చి చేరింది. ఇక వచ్చిన వెంటనే అమ్మడు టాలీవుడ్ లో గాడితప్పిన తన కెరీర్ బండిని పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది.
హైదరాబాద్ లో అడుగుపెట్టిన వెంటనే, తన ప్రాణ స్నేహితురాలు లక్ష్మీ మంచును కలసిన రుకుల్ అదే టైమ్ లో డైరెక్టర్ క్రిష్ తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మీట్ కేవలం ఫ్రెండ్లీ మీట్ మాత్రమే కాదని ఇప్పుడు అర్థమైంది. ఫ్రెండ్స్ అందరూ ఒక్క గూటికి చేరింది, తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించేందుకేనని స్పష్టమైంది.
క్రిష్ సారధ్యంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో రకుల్ లీడ్ రోల్ చేసేందుకు అంగీకరించిందట. ఆహాలో ఈ వెబ్ సిరీస్ టెలీకాస్ట్ అవ్వనుంది. మరోవైపు అమ్మడు కూడా కథానాయిక ప్రాధాన్యంగల చిత్రాలపై దృష్టిపెట్టాలని భావిస్తోంది.
ఇక ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ సరసన చెక్ అనే సినిమాలో నటిస్తున్న రకుల్ ప్రీత్, మరోవైపు డైనమిక్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ రెండు సినిమాలూ అమ్మడి కెరీర్ కు ఏ విధంగా బూస్టింగ్ ఇస్తాయో చూడాలి.