Don't Miss!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హైద్రాబాద్ పోలీసులపై రకుల్ ప్రశంసలు.. వీడియో వైరల్
కరోనా లాంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోలీసులు, వైద్యులు విధులు నిర్వహించారు. నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే కరోనాకు ఎవ్వరూ మినహాయింపు కాదు. పోలీసు, వైద్య సిబ్బందికి కూడా కరోనా సోకింది. వారు సాధారణ ప్రజల్లానే కరోనా గుప్పిట చిక్కుకున్నారు. అయితే హైద్రాబాద్ పరిధిలో పోలీసులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడ్డారు. వారంతా కోలుకుని తిరిగి విధుల్లోకి చేరుకున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
కరోనాను జయించిన 390 మంది పోలీసులు తిరిగి విధుల్లోకి చేరడాన్ని అభినందిస్తూ.. రకుల్ పోలీస్ విభాగంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మనమంతా ఇంట్లో ఉన్న సమయంలో హైద్రాబాద్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇరవై నాలుగు గంటలు పని చేసింది. ఈ కారణంగా వారిలో ఎంతో మంది కరోనా బారిన పడ్డారు.
కమిషనర్ అంజనీ కుమార్ చెప్పిన దాని ప్రకారం దాదాపు 390 మంది పోలీసాఫీసర్లు తిరిగి విధుల్లోకి హాజరయ్యారు. వారంతా కరోనాను జయించారు. ఈ సందర్భంగా వారిని నేను అభినందిస్తున్నాను. మా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న పోలీసులకు ధన్యవాదాలు. మా అందరికీ ఇంకా జాగ్రత్తగా చూసుకునే శక్తిని వారికి ఇవ్వాలని కోరుకుంటున్నా' అని రకుల్ ప్రీత్ చెప్పుకొచ్చింది.