Don't Miss!
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బికినీలో వాటర్ బేబీ అదిరే అందాలు.. టీజ్ చేస్తూ పిక్ రిలీజ్ చేసిన రకుల్!
టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరితో నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలు కరువయ్యాయి. ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ భామ ముంబైకి మకాం మార్చేసింది. తాజాగా ఆమె హాట్ ఫోటో ఒకటి షేర్ హేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే.
డబ్బు ఎక్కువ వస్తోందని
సెల్వ రాఘవన్ 7జి బృందావన్ కాలనీ కన్నడ రీమేక్ తో రకుల్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పటికి తనకు సినిమాలు అంటే తెలియదని ఆమె చెబుతుంటుంది. మోడలింగ్ కి వచ్చే డబ్బు కంటే సినిమాల్లో చేస్తే వచ్చే డబ్బు ఎక్కువగా ఉంటుందని తెలియడంతో సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నానని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
కన్నడ సినిమాతో ఎంట్రీ
అలా కన్నడలో ఒక సినిమా చేసిన అనంతరం తెలుగులో కెరటం అనే సినిమాతో ఆమె పరిచయం అయింది. తమిళంలో దానినే యువన్ అనే పేరుతో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మరో రెండు తమిళ సినిమాలు చేసినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. కానీ తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్ గా నటించగా ఆ సినిమా మంచి హిట్ అయింది.
స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు
ఆ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఆమె లౌక్యం, కరెంట్ తీగ, పండగచేస్కో, కిక్ 2 వంటి సినిమాలతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతే కాక బ్రూస్లీ, నాన్నకుప్రేమతో, సరైనోడు, ధ్రువ, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్ లాంటి సినిమాలు తెలుగులో చేసి ఆమె స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.
బికినీలో అలా
చివరిగా నాగార్జున సరసన మన్మధుడు సీక్వెల్ సినిమాలో నటించిన తరువాత ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. ఇక అందుకే ఆమె ఎక్కువగా ముంబైలోనే ఉంటోంది. ఇక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు ఏకంగా బికినీ పిక్ షేర్ చేసింది. అయితే ఇది పాత ఫోటో అని, పార్టీ చేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చింది.
సినిమాల విషయానికి వస్తే
ఇక ఈ భామ చివరిగా ఆమె నితిన్ సరసన ఓ సినిమాలో నటించింది. కానీ ఆమెకు ఈ సినిమా హిట్ కాకపోవడంతో మళ్లీ తెలుగులో పెద్దగా అవకాశాలు లేవనే చెప్పాలి.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే సినిమాలో కూడా ఈ భామ హీరోయిన్ గా నటించింది. తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయలేదు కానీ విశ్వక్ సేన్ సినిమాలో నటించే అవకాశం ఉందని అంటున్నారు.