Don't Miss!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
టాలీవుడ్లో ఆ నాలుగు కుటుంబాలపై రకుల్.. వాళ్ళు ప్లాపై ఉంటే!
కెరటం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. యువతలో క్రేజ్ పెరగడం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి విజయాలు తోడు కావడంతో సౌత్ లోనే రకుల్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలందరి సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మీడియా నుంచి రకుల్ ప్రీత్కు ఓ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్ లో నాలుగు కుటుంబాలే ఉన్నాయనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
చిత్ర పరిశ్రమలో వారసత్వం
టాలీవుడ్లో వారసత్వం ఎక్కువవుతోంది అనే విమర్శలు తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. వారసుల వలన బయటవారికి అవకాశాలు రావడం లేదని చాలా మంది ప్రముఖులు గతంలో అభిప్రాయ పడ్డారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు కుటుంబాల హవా ఎక్కువగా ఉందనే కామెంట్స్ పై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సమాధానం ఇచ్చింది. ఆ నాలుగు కుటుంబాలకు మద్దత్తు తెలుపుతూ రకుల్ సమాధానం చెప్పడం విశేషం.
నిజమే కానీ
రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టాలీవుడ్ లో నాలుగు కుటుంబాలు ఉన్నాయనేది నిజమే కానీ.. వాళ్ళ హవానే కొనసాగుతుందనేది వాస్తవం కాదు అని రకుల్ తెలిపింది. వారివలన ఏదో నష్టం జరిగిపోతోంది అని అనుకోడం సరైనది కాదు. మీరంటున్న వారసర్వం వెనుక దశాబ్దాల కష్టం ఉందనే విషయాన్ని గుర్తించాలి అని రకుల్ తెలిపింది.
రాఖీ ఖన్నా బర్త్ డే పార్టీలో కుర్ర హీరోలు, నితిన్ చేతికి ఏమైంది? (ఫోటోస్)
ఆ హీరోలు ప్లాపై ఉంటే
వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు ప్లాపై ఉంటే మీరు ఈ ప్రశ్న అడగరు. వాళ్లకు టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం అని రకుల్ ప్రీత్ తెలిపింది. అయినా కూడా విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణిస్తున్నారు. దీని వలన ఇండస్ట్రీలో కొత్తవారికి కూడా అవకాశం ఉంటుందని అర్థం అవుతోంది. ఆ హీరోలంతా ప్రతిభని నిరూపించుకున్న తర్వాత ఇలాంటి కామెంట్స్ చేయకూడదని రకుల్ తెలిపింది.
క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ
సౌత్ లో ఇటీవల్ రకుల్ జోరు కాస్త తగ్గింది. అయినా కూడా ఇప్పటికి మంచి అవకాశాలు అందుకుంటోంది. తమిళంలో కార్తీ, సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో వెంకీ, చైతు నటించే మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామలో హీరోయిన్గా రకుల్ పేరు పరిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవిగా అలరించబోతోంది.