Don't Miss!
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నా పరువు, ప్రతిష్టను మంట గలుపుతున్నారు.. మళ్లీ ఢిల్లీ హైకోర్టుకు రకుల్ ప్రీత్ సింగ్!
బాలీవుడ్తో డ్రగ్స్ రాకెట్ లింకుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. డ్రగ్స్కు సంబంధించిన తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మనస్తాపం చెందారు. దాంతో మళ్లీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ కోర్టుకు రకుల్ ప్రీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ ఏమిటంటే..
Recommended Video
నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రేయసి రియా చక్రవర్తికి సంబంధించిన డ్రగ్స్ కేసులో తనను లింక్ చేస్తూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ కథనాలు నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయి. ఆ కథనాలను నియంత్రించేలా చర్యలు వెంటనే తీసుకోండి అంటూ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు.
మీడియా కథనాలను నియంత్రించండి
డ్రగ్స్ కేసును లింక్ చేస్తూ నాపై వస్తున్న కథనాలపై గతంలో మీరు (ఢిల్లీ హైకోర్టు) ఇచ్చిన ఆదేశాలను మీడియా పట్టించుకోవడం లేదు. ఎప్పటిలానే కథనాలు వస్తున్నాయి. ప్రతికూల కథనాలతో నా ప్రతిష్టకు భంగం కలుగుతున్నది. నా ఇమేజ్పై మచ్చ పడుతున్నది. కాబట్టి మీడియా కథనాలను నియంత్రించేలా చర్యలు తీసుకోండి అంటూ రకుల్ ఫ్రీత్ సింగ్ పిటిషన్లో పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు
డ్రగ్స్ కేసులో మీడియా కథనాలను కేంద్ర సమాచార, ప్రసారశాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేబుల్ టీవీ చట్టాలకు అనుగుణంగా ప్రసారం చేయాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను మీడియా, టీవీ ఛానెల్స్ పట్టించుకోవడం లేదు అని రకుల్ ప్రీత్ సింగ్ కోర్టుకు నివేదించారు. రకుల్ దాఖలు చేసిన పిటిషన్ను ఏకసభ్య న్యాయమూర్తితో కూడిన ధర్మాసనంలో జస్టిస్ నవీన్ చావ్లా ఈ పిటిషన్ను విచారించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పిటిషన్ను వచ్చేవారానికి వాయిదా వేశారు. గతంలో దాఖలు చేసిన పిటిషన్ అక్టోబర్ 15వ తేదీన విచారణకు రానున్నది.
నేను డ్రగ్స్ వాడను.. మరోసారి రకుల్ స్పష్టీకరణ
ఇదిలా ఉండగా, డ్రగ్స్ వాడకంతో తనకు సంబంధంల లేదు. మద్యం, ధూమపాన అలవాట్లు లేవు. ఆరోగ్య సంబంధింత విషయాలపై నాకు మక్కువ ఎక్కువ. యోగా, మెడిటేషన్, ఫిట్నెస్ లాంటి ఆరోగ్య సూత్రాలను పాటిస్తాను. అలాంటి తనపై డ్రగ్స్ ఆరోపణలు రావడం నా ప్రతిష్టకు తీరని నష్టం కలుగుతున్నది అని ఇటీవల రకుల్ చెప్పడం తెలిసిందే.