Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
రకుల్ ప్రీత్ కి బంపర్ ఆఫర్..నెవర్ బిఫోర్ బోల్డ్ పాత్రలో?
కెరటం అనే సినిమాతో 2011లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్.. అయితే ఆమెకు పేరు తెచ్చిపెట్టింది మాత్రం 2013లో సందీప్ కిషన్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా. ఆ సినిమాలో ప్రార్థనగా ఆమె నటన ప్రేక్షకుల అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, పండగ చేసుకో ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ తెలుగులో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లింది. అయితే గత కొద్దికాలంగా ఆమెకు పెద్దగా అవకాశాలు దక్కడం లేదు. ఆమె మన్మధుడు సినిమాలో నాగార్జున కు జంటగా నటించింది.
అది డిజాస్టర్ కావడంతో ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. చెక్ అనే సినిమాలో ఆమె నటించినా, అదీ హిట్ కాలేదు. ఆమె క్రిష్ దర్శకత్వంలో నటించిన కొండపొలం అనే సినిమా షూటింగ్ పూర్తయి రిలీజ్కు సిద్ధంగా ఉంది. అయితే తెలుగులో అవకాశాలు దక్కకపోయినా ఈ భామకు హిందీలో బాగానే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బోల్డ్ సబ్జెక్ట్ ని ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ లో బిజీ
రకుల్ ప్రీత్ సింగ్ కి తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్లో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ అమ్మడి చేతిలో మంచి ఆఫర్స్ ఉన్నాయి. అజయ్ దేవగన్,సిద్ధార్థ్ మల్హోత్రా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న థ్యాంక్ గాడ్, ఆయుష్మాన్ ఖురానా డాక్టర్ జి అలాగే మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ రోనీ స్క్రూవాలా నిర్మాణంలో ఒక సినిమా ఒప్పుకున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె ఆ సినిమా సైన్ చేసినట్లు ప్రచార జరుగుతోంది.
కండోం టెస్టర్ పాత్రలో
రోనీ స్క్రూవాలా ప్రొడక్షన్ నుంచి ఎన్నో విభిన్నమైన సినిమాలు కొత్త కథలు తెరకు పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మునుపెన్నడూ నటించని పాత్రలో నటించనుందని తెలుస్తోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ ఉమెన్స్ సెంట్రిక్ ఫిలింలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక కండోమ్ టెస్టర్ పాత్రలో నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె సైన్ చేసింది అని ఒక ప్రచారం జరుగుతుండగా అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.
ఓకే చెప్పింది కానీ
అయితే అయితే రకుల్ సన్నిహిత వర్గాలు మాత్రం ఇప్పటికే ఆమె ప్రాజెక్టుకు ఓకే చెప్పింది కానీ ఇంకా అగ్రిమెంట్ లాంటిదైతే జరగాల్సి ఉందని చెబుతున్నారు. ఇది కామెడీ ప్రాజెక్ట్ అని ఎక్కువగా ఆయుష్మాన్ ఖురానా చేసే సినిమాల లాంటి సినిమా అని చెబుతున్నారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్ పాత్ర పోషిస్తుందని ఆమె సన్నిహిత వర్గాలు కూడా ఖరారు చేశాయి. అదే నిజమైతే ఇలాంటి పాత్రలో నటించబోయే తొలి భారతీయ నటిగా కూడా చరిత్రలో నిలిచిపోనుంది.
Recommended Video
అదే డిసైడింగ్ ఫ్యాక్టర్
ఇక రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో కెరీర్ డిసైడ్ చేసే సినిమా క్రిష్ సినిమానే అని అంటున్నారు. ఈ సినిమాకి కొండపొలంతో పాటు మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ హీరోగా ఎంట్రీ ఇచ్చి రికార్డ్స్ బ్రేక్ చేసిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు చక్కబడితే రిలీజ్ చేస్తారని సమాచారం. మరి ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ని టాలీవుడ్ లో సక్సస్ ట్రాక్ ఎక్కుతుందా ? లేదా చూడాలి.