Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రేపిస్ట్ రణ్ బీర్, సైకో దీపికా - టీమ్ కంగనా రనౌత్
బాలీవుడ్ లో బందుప్రీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న కంగనా రనౌత్, ఇప్పుడు నోపోటిజానికి కొమ్ముకాస్తున్న ఔట్ సైడర్లనూ విడిచిపెట్టడంలేదు. ఇప్పటివరకూ ఆలియా భట్, కరణ్ జోహార్, మహేశ్ భట్ ని పబ్లిక్ గా ఉతికి ఆరేసిన కంగనా, ఇప్పుడు వారికి కొమ్ముకాస్తున్న నెపో స్టార్స్ తో పాటూ, ఔట్ సైడర్లు అయిన బడా స్టార్లను సైతం ఏకిపారేస్తోంది.
తాజాగా అమ్మడి తిట్లదండకం బారిన పడింది మరెవరో కాదు, బాలీవుడ్ బాక్సాఫీస్ పై ఢంఖాబజాయించిన దీపికా పదుకోనేపై కంగన దృష్టిపెట్టింది. తనని తాను ఓ మానసిక వ్యాధిగ్రస్థురాలిగా ప్రకటించుకున్న దీపికను ఎవ్వరూ సైకో అని, రాక్షసి అని అనరని చెప్పింది. ఇక అమ్మాయి కనబడితే చాలు చొంగకార్చుకుని ఆమె చుట్టూ చక్కర్లు కొట్టే రణ్ బీర్ ను ఎవరూ రేపిస్ట్ అనరని నిష్ఠూరాలు పోయింది. తనలా చిన్న పట్టణాల నుంచి, సాధారణ కుటుంబాల నుంచి వచ్చే వారిని మాత్రమే టార్గెట్ చేస్తారని వాపోయింది.
బోంబే వెల్వెట్, బేషరమ్, జగ్గా జాసూస్, రాయ్ వంటి భారీ ఫ్లాపులు ఒకదాని వెంట మరొకటి వచ్చినా రణ్ బీర్ కు యే దిల్ హై ముష్కిల్, తమాషా,సంజూ వంటి భారీ ప్రాజెక్ట్ లు లభించాయని, కానీ, సుశాంత్ కు రాబ్తా, తనకు రంగూన్ వంటి ఫ్లాపులు పడగానే ఇండస్ట్రీ తమను దూరం పెట్టేసిందని వివరించింది. దీన్ని బట్టీ, తొలి ఫ్లాప్ తరువాత బంధు ప్రీతి సైతం పనికిరాదన్న వాదన నిజం కాదని నిరూపితమైందని కంగన స్పష్టం చేసింది.
మరోవైపు ఆయుష్మాన్ ఖురానాను చప్లూస్ ఔట్ సైడర్ గా వర్ణించిన కంగనా టీమ్, వీళ్లు కేవలం అవకాశాల కోసం మాత్రమే మూవీ మాఫియాను, నెపో కిడ్స్ ను సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించింది. తమ లాంటి వాళ్లు చేస్తున్న పోరాటం వల్ల లబ్ధి పొందుతుంన్నది వారేనని వ్యాఖ్యానించింది.