Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఏంజెల్ ఆర్న తరువాత మళ్లీ ఇలా.. మారుతిపై రాశీ ఖన్నా కామెంట్స్
ప్రతీరోజూ పండగే అనే సినిమాతో రాశీ ఖన్నా తనలోకి కామెడీ యాంగిల్ను బయటపెట్టేసింది. దర్శకుడు మారుతి అప్పటి ట్రెండ్ అయిన టిక్ టాక్ పిచ్చిని రాశీ ఖన్నా పాత్రలో చూపించాడు. అలా ఏంజిల్ ఆర్నా పాత్రలో రాశీ ఖన్నా సరిగ్గా సరిపోయింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో పాటు రాశీ ఖన్నా పాత్రకు మంచి పేరు వచ్చింది. అయితే మళ్లీ మారుతి దర్శకత్వంలోనే రాశీ ఖన్నా మరో చిత్రంతో నటిస్తోంది.
జాన్వీ కపూర్ నెవర్ బిఫోర్ గ్లామర్ షో
ప్రస్తుతం మారుతి గోపీచంద్తో పక్కా కమర్షియల్ అనే చిత్రాన్ని చేస్తోన్నాడు. మొదటగా ఈ సినిమా కోసం రవితేజను హీరోగా అనుకున్నారు. కానీ రవితేజ ఎక్కువగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో చివరకు గోపీచంద్ వద్దకు ప్రాజెక్ట్ వెళ్లినట్టు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే మొత్తానికి గోపీచంద్తో అదిరిపోయే కమర్షియల్ సినిమాను మారుతి తీయబోతోన్నాడు.
ఈ మూవీ షూటింగ్లో తాజాగా రాశీ ఖన్నా ఎంట్రీ ఇచ్చింది. మారుతి దర్శకత్వంలో మళ్లీ పని చేయడంతో రాశీ ఖన్నా స్పందించింది. ఏంజిల్ ఆర్నా తరువాత మళ్లీ అదిరిపోయే పాత్రలో చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్లో రెండు ప్రాజెక్ట్లు, హిందీ వెబ్ సిరీస్లోనూ నటిస్తోంది. మొత్తానికి అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో రాశీ ఖన్నా దూసుకుపోతోంది.