Don't Miss!
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. మిస్యూ, లవ్యూ.. రష్మిక ఆసక్తికర పోస్ట్!
'ఛలో' సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయిన కన్నడ భామ రష్మిక మందన విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
అయితే ఈ సినిమాకి అనుకున్నంత రెస్పాన్స్ లభించలేదు. ఆ తర్వాత ఇటీవల మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'లో నటించి రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఆ తరువాత నితిన్తో భీష్మతో హిట్ అందుకుని మంచి ఫాంలో ఉంది. అయితే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసిన పిక్ ఆసక్తికరంగా మారింది.
లాక్ డౌన్ ఉండడంతో
రష్మిక మందన్న తాజాగా తన డార్లింగ్ సిస్టర్ పిక్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటున్న తన చిట్టి చెల్లెలు షిమాన్కు ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. కరోనా పరిస్థితుల దృష్ట్యా, రష్మిక హైదరాబాద్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్వగ్రామమైన కర్ణాటకలోని విరాజ్పేట కు ప్రయాణించలేకపోయింది. ఎందుకంటే కర్ణాటక వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ ఉంది. అయితే తాను దూరంగా ఉన్నా రష్మిక తన సోదరి పుట్టినరోజు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంది.
ఐ మిస్యూ, ఐ లవ్యూ
దూరంగా ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా చిట్టి చెల్లికి విషెస్ చెప్పింది. '' నా డార్లింగ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ అక్క నిన్ను అందరి కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. నిన్ను ఎవరూ బాధపెట్టలేరు, అందుకు నేను అనుమతించను'' అని పోస్ట్ చేసింది. అలానే ప్రపంచం అంతా ఎలా ఉన్నా నేను ఇంటికి వస్తాను, నేను నా డార్లింగ్ తో సమయం గడుపుతానని పోస్ట్ చేసింది. ఐ మిస్యూ, ఐ లవ్యూ అంటూ ఆమె తన సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పింది.
సెటైర్లు వచ్చినా పట్టించుకోకుండా
రష్మిక మందన్నకు చిట్టి చెల్లి ఉందన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ముందుగా చాలా సెటైర్లు వచ్చాయి. రష్మిక మందాన్న ఏజ్కు, తన చెల్లి ఏజ్కు మధ్య బాగా గ్యాప్ ఉండటంతో అందరూ సెటైర్లు వేశారు. అయితే ఇవన్నీ పట్టించుకోని రష్మిక తన చిట్టి చెల్లికి విషెస్ చెప్పింది. రష్మిక మందాన్న తన చెల్లితో లాక్డౌన్లో ఎంత అల్లరి చేసిందో కూడా వీడియోలు ద్వారా బయటకు రావడంతో అవి ఎంతగానో వైరల్ అయ్యాయి. షూటింగ్లకు బయటకు వెళ్లిన సమయంలో చెల్లిని బాగా మిస్ అవుతాను అని రష్మిక ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
వరస సినిమాలతో బిజీగా
ఆమె ప్రస్తుతం పుష్ప అనే సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలకు ఓకే చెప్పిన ఆమె తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యకు జోడీగా తర్వాతి సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా సూర్యకు 40వ సినిమా. అలాగే ఈ అమ్మడు హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది.