Don't Miss!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రష్మిక మందన్న ఆస్తులపై ఐటీ దాడులు.. అసలు విషయం బయటపెట్టిన బ్యూటీ
కన్నడ భామ రష్మిక మందన్న కెరీర్ గ్రాఫ్ ఎవరూ ఊహించని విధంగా దూసుకెళ్తున్నది. కన్నడ, టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. అయితే తన ఇంటిపై ఇన్కం ట్యాక్స్ దాడులు జరిగాయనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. అయితే వాటిపై క్లారిటీ ఇస్తూ ఏమని వివరణ ఇచ్చారంటే...
రెమ్యునరేషన్ భారీగా పెంపు
వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్టు వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాల తర్వాత ప్రతీ సినిమాకు రూ.2 కోట్ల రూపాయలు తీసుకొంటున్నట్టు వార్తలు మీడియాలో వైరల్అయ్యాయి. అయితే తనకు అంత భారీగా చెల్లించే నిర్మాతలు లేరు అంటూ వివరణ ఇచ్చారు.
రష్మిక ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు
అయితే రష్మిక పారితోషికం భారీగా పెంచారనే వార్తల నడుమ ఐటీ అధికారులు పంజా విసిరారనే వార్త మరోసారి గుప్పుమన్నది. రష్మిక నివాసంలో ఐటీ దాడులు జరిగాయనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. అలాంటి వార్తల్లో నిజం లేదు. మీడియాలో వచ్చే వార్తలన్నీ రూమర్లే అంటూ క్లారిటీ ఇచ్చారు.
గతేడాది కూడా ఐటీ దాడులంటూ
గతేడాది జనవరిలో కర్ణాటకలోని కొడగు జిల్లాలోని తన ఆస్తులపై ఐటీ అధికారులు మెరుపు దాడులు చేయడం సంచలనం రేపింది. తన ఫామ్హౌస్లను కూడా వదలకుండా సోదాలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఏడాదికి రష్మిక ఆస్తులపై ఐటీ దాడులనే విషయం మరింత సెన్సేషనల్గా మారింది.
రష్మిక మందన్న కెరీర్
ఇక కెరీర్ విషయానికి వస్తే.. రష్మిక నటించిన పొగరు చిత్రం తెలుగులోకి డబ్ అయి ఫిబ్రవరి 19వ తేదీన రిలీజ్కు ముస్తాబవుతున్నది. ఇక అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇక బాలీవుడ్లో మిషన్ మజ్నుతోపాటు ఓ భారీ బ్యానర్లో ఓ చిత్రం చేయనున్నది.