twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    4నెలల నుంచి 20కుటుంబాలకు అండగా నిలుస్తున్న మహేష్ హీరోయిన్.. సరిలేరు నీకెవ్వరు!

    |

    సినిమా ఇండస్ట్రీపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలు లాక్ డౌన్ కారణంగా ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా వైరస్ అంతకంతకు పెరుగుతుండడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కొంతమంది సినీ తారలు ఎక్కువ మందికి సహాయం చేయకపోయినా వారిపై ఆధారపడిన కుటుంబాలను మాత్రం వదిలిపెట్టడం లేదు. అలాంటి వారిలో సరిలేరు నీకెవ్వరు బ్యూటీ ఒకరు.

    అత్యదిక రెమ్యునరేషన్..

    అత్యదిక రెమ్యునరేషన్..

    మహేష్ బాబుతో ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరులో అల్లరిగా నటించి బాక్సాఫీస్ హిట్ అందుకుంది రష్మీక మందన్న. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యదిక రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్ హీరోయిన్స్ లలో కూడా రష్మీక స్థానం సంపాదించుకుంది. ఏ మాత్రం తడబడకుండా తోటి హీరోయిన్స్ కి గట్టి పోటీని ఇస్తోంది.

    పనిలేని వారి కోసం..

    పనిలేని వారి కోసం..

    అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీక మందన్న ఎవరికి తెలియని ఒక విషయాన్నీ చెప్పి అభిమానుల మనసులో తన రేంజ్ ని పెంచుకుంది. ఈ లాక్ డౌన్ కారణంగా వారి దగ్గర పని చేస్తున్న చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారట. అయితే వారిని మాత్రం రష్మీక వదల్లేదట. తనకు వీలైనంత వరకు సహాయం చేస్తున్నట్లు చెబుతోంది.

     20 కుటుంబాలకు అండగా

    20 కుటుంబాలకు అండగా

    తన తండ్రి దగ్గర అలాగే తన దగ్గర దాదాపు 20మంది పనిచేస్తున్నారు అంటూ .. వారి కుటుంబాలకు గత నాలుగు నెలలుగా సహాయంగా ఉన్నట్లు తెలిపింది. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఒక కుటుంబానికి కావాల్సిన అవసరాలను ప్రతి నెల అందేలా చేస్తున్నారట రష్మీక. మనం బావుండలి అంటే ముందు మన చుట్టూ ఉన్న వాళ్ళు బావుండలనే విధంగా రష్మీక సహాయాన్ని అందిస్తోంది.

    Recommended Video

    Green India Challenge : Tollywood Celebrities Actively Participating Green India Challenge
    ఆనందం నుంచి వచ్చే కిక్కు..

    ఆనందం నుంచి వచ్చే కిక్కు..

    గతంలో కూడా రష్మీక చాలా వరకు సోషల్ సర్వీస్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంది. మనల్ని ఇంత అభిమానించే వారికి ఎంతో కొంత సహాయం చేస్తుంటే ఆ ఆనందం కిక్కే వేరని రష్మీక చాలా డిఫరెంట్ చెబుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నన ఆ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

    English summary
    The war between Tollywood star heroines lasted until last year. But senior heroines have now entered the race with Pooja Hegde - Rashmika Mandanna. The two are also making films in a hostile manner. However, Pooja Hegde has been in the lead with a series of victories since the start of the competition and is now slowly gaining first place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X