చాలా గ్యాప్ తర్వాత రష్మిక బోల్డు షో: తొలిసారి ఆ పార్ట్ చూపించిందిగా!
సాధారణంగా సినీ రంగంలో చాలా కాలం పాటు స్టార్లుగా సత్తా చాటాలంటే అందరికీ సాధ్యం కాదు. కానీ, దీన్ని చాలా మంది భామలు సుసాధ్యం చేస్తూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఇలా దేశ వ్యాప్తంగా హవాను చూపిస్తూ ముందుకు సాగుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
రష్మిక అప్పుడే సెన్సేషన్:టీనేజ్లోనే రష్మిక మందన్నా 'కిర్రాక్ పార్టీ' అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత అక్కడే పలు సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఆ తర్వాత 'ఛలో' అనే మూవీతో తెలుగులోకి వచ్చింది. దీని తర్వాత ఈ అమ్మడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుని దేశ వ్యాప్తంగా సెన్సేషన్గా మారింది.

వరుస హిట్లతో స్టార్డమ్:తెలుగులో మంచి ఆరంభాన్ని అందుకున్న రష్మిక మందన్నా.. ఆ తర్వాత తెలుగులో వరుసగా ఎన్నో సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే 'ఛలో'తో పాటు 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుంది. తద్వారా రష్మిక స్టార్డమ్ను సొంతం చేసుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పడ్డా ఆమె కెరీర్కు ఇబ్బంది కాలేదు.
బాలీవుడ్లోనూ.. వాటితో:'పుష్ప' వంటి పాన్ ఇండియా సక్సెస్ తర్వాత రష్మిక.. 'ఆడవాళ్లు మీకు జోహర్లు'లో నటించింది. ఇది ఆమెను దెబ్బ కొట్టింది. అయితే, ఆ తర్వాత వచ్చిన 'సీతా రామం' సూపర్ హిట్ అవడంతో ఆమె మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. అలాగే, అమితాబ్ బచ్చన్తో కలిసి రష్మిక నటించిన 'గుడ్బై' మూవీ కూడా గత ఏడాదే విడుదలై పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది.

ఇప్పుడా సినిమాలతోనే:రష్మిక మందన్నా ఈ ఏడాది ఆరంభంలోనే 'వారిసు', 'మిషన్ మజ్నూ' వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవి ఆమెకు మంచి ఫలితాలనే అందించాయి. ఇక, ప్రస్తుతం ఈ భామ 'పుష్ప 2' మూవీ చేస్తోంది. అలాగే, రణ్బీర్ కపూర్తో సందీప్ రెడ్డి వంగా తీసే 'యానిమల్' మూవీనీ చేస్తోంది. వీటితో పాటు 'రెయిన్బో' అనే సినిమాలోనూ భాగం అయింది.

అందులో యమ బిజీగా:సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని భాషల్లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్తో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్డేట్లను కూడా ఇస్తోంది. దీంతో నేషనల్ క్రష్ అనిపించుకుంటూ వెళ్తోంది.

బోల్డు ట్రీట్తో క్రష్గానే:రష్మిక మందన్నా చాలా కాలంగా సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో అప్పుడప్పుడూ హాట్ ట్రీట్ ఇస్తూ తీసుకున్నవి కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా గ్లామర్ షో చేస్తూ దిగిన పిక్లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ అమ్మడు ఇంటర్నెట్ను షేక్ చేసేస్తోంది.

రష్మిక సెల్ఫీలు వైరల్:పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు నాటీ ఫోజులతో సెల్ఫీలు తీసుకుంది. దీంతో ఇందులో ఆమె నాభి, నడుము అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా రష్మిక మందన్నా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చి.. వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











