Rashmika Mandanna గ్లామర్ ట్రీట్.. లేటేస్ట్ ఫోటోషూట్తో అదరగొట్టేసిన శ్రీవల్లి
రష్మిక మందన్నా.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం అవసరం లేని పేరిది. అంతలా ఈ సుందరాంగి చాలా కాలంగా టాలీవుడ్లో హవాను చూపిస్తోంది. అంతేకాదు, అదిరిపోయే అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. అదే సమయంలో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంటోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. తాజాగా ఓ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకోసం ఓ హాట్ ట్రెడీషనల్ డ్రెస్ వేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి మరి!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే రష్మిక మందన్నా స్టార్గా ఎదిగిపోయింది. ఇక్కడ ఆమె 'ఛలో' నుంచి మొదలుకొని 'గీత గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ', 'పుష్ప' వంటి భారీ హిట్లను సొంతం చేసుకుంది. మధ్యలో కొన్ని పరాజయాలు వచ్చినా రష్మిక క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతూనే వస్తోందనే చెప్పాలి.

ఇక్కడే కాదు.. అక్కడా హవానే
ఈ ఏడాది రష్మిక మందన్నా చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే మూవీ ఫ్లాప్ అయింది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 'పుష్ప 2' మూవీ చేయనుంది. అలాగే, 'మిషన్ మజ్ను' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అలాగే, అమితాబ్తో కలిసి 'గుడ్బై' అనే సినిమాలోనూ నటిస్తోంది. సందీప్ రెడ్డి వంగా 'యానిమల్'తో పాటు పలు దక్షిణాది మూవీలలో చేస్తోంది.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీతో
వేరే భాషల చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ రష్మిక మందన్నా తన మొదటి ప్రాధాన్యాన్ని మాత్రం తెలుగుకే ఇస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడామె పలు చిత్రాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ భామ 'సీతా రామం' అనే తెలుగు సినిమాను కూడా చేసింది. ఇందులో దుల్కర్ సల్మాన్ హీరోగా చేస్తున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల అవుతుంది.

సోషల్ మీడియాలో సందడిగా
తెలుగు, తమిళం, కన్నడం, హిందీ చిత్రాలతో కెరీర్ను ఎంతో సక్సెస్ఫుల్గా నడుపుకుంటోన్న రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమా అప్డేట్లను కూడా ఇస్తోంది. దీంతో ఆమె ఫాలోయింగ్ పెరుగుతూ ఉంటోంది.

అందాలను ఆరబోస్తోన్న భామ
సోషల్ మీడియాలో రష్మిక మందన్నా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో ఎక్కువగా తన ఫొటోలు, వీడియోలు వదులుతోంది. వీటిలో అప్పుడప్పుడూ అందాలు ఆరబోస్తూ తీసుకున్న ఫొటోషూట్లు కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్లను కూడా రష్మిక ఎక్కువగా షేర్ చేస్తోంది. అందుకే ఈ భామ నేషనల్ క్రష్ అయింది.

ఢిల్లీ ఫ్యాషన్ వీక్లో హొయలు
వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్న రష్మిక మందన్నా.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ వాక్ చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, మొదటిసారి ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న ఈ అమ్మడు అందరి దృష్టినీ ఆకర్షించేలా హొయలు పోయింది. దీంతో ఆమె పేరు మళ్లీ ట్రెండ్ అవుతోంది.

యమ హాట్గా కనిపించిందిగా
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ అమ్మడు ఫ్యాషన్ వీక్ కోసం డిజైన్ చేసిన ట్రెడీషనల్ డ్రెస్ను ధరించింది. అయితే, ఇందులో ఆమె విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా రష్మిక ఎద అందాలు గతంలో కంటే ఎక్కువగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ విపరీతంగా వైరల్గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











