Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
రష్మిక మందన్నా సెన్సేషన్: నా ఇంకో సగం మిస్ అయిందంటూ పోస్ట్.. విజయ్ గురించేనా.!
యంగ్ హీరో నాగశౌర్య నటించిన 'ఛలో' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత ఆమె నటించిన 'గీత గోవిందం' కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, తర్వాత పలు చిత్రాలు ఆశించినంతగా ఆడలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా రాణిస్తోంది ఈ రష్మిక.
అందంతో పాటు చక్కనైన అభినయం కలిగిన హీరోయిన్ కావడంతో ఈమె ఫుల్ బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో కావడంతో అమ్మడు మంచి ఉత్సాహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా పోస్ట్..? ఎందుకు చర్చనీయాంశం అయింది.? వివరాల్లోకి వెళితే...
అక్కడ అమ్మడు ఫుల్ బిజీ
రష్మిక మందన్నా సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగా ఈ కన్నడ బ్యూటీ తన సినిమాలకు సంబంధించిన విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి చెందిన అంశాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.
అందరికీ ఆమె కావాలి
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రష్మికకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు'తో పాటు నితిన్ ‘భీష్మ' సినిమాలో నటిస్తోంది. వీటి తర్వాత సుకుమార్ - అల్లు అర్జున్ సినిమా షూటింగ్లో పాల్గొననుంది. వీటితో పాటు కన్నడ చిత్రాలకూ సంతకాలు చేసేసింది.
హాట్ టాపిక్గా రష్మిక పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తాజాగా ఓ ఫొటోను షేర్ చేసింది. ‘ఈ ఫొటోలో ఒకే ఒక్కటి మిస్ అయింది. అది నా మరో సగం అయిన మంకీ' అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆ మంకీ ఎవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. దీనిపై పలువురు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
రష్మిక అన్నది ఆ హీరో గురించేనా
రష్మిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది. దీంతో ఆమె పేర్కొన్నది ఎవరి గురించి అని అందరూ ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఆమె చెప్పిన ఆ మంకీ విజయ్ దేవరకొండే అనేదే దాని సారాంశం. దీనికి కారణం.. వీళ్లిద్దరూ కలిసి గోవాలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కు వెళ్లడమేనని టాక్. రష్మిక ఫొటో కూడా అక్కడిదే కావడం విశేషం.
Recommended Video
విజయ్తో లవ్ అంటూ ప్రచారం
గతంలో రష్మిక టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ప్రేమాయణం సాగిస్తోందని కొందరు వార్తలు పుట్టించిన విషయం తెలిసిందే. దీనిపై కన్నడ బ్యూటీ స్వయంగా స్పందించింది. వీళ్లిద్దరూ కలిసి ‘గీత గోవిందం', ‘డియర్ కామ్రేడ్' చిత్రాల్లో నటించారు. దీంతో ఈ వార్తలు ఎక్కువైపోయాయి.