Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘పెంగ్విన్’ను వీక్షించిన రష్మీక.. కీర్తి సురేష్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇగోలు ఉంటాయని తెలిసిందే. ఓ హీరోనో హీరోయినో చేసిన సినిమా వేరొకరు ప్రశంసించడం అరుదుగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మారుతన్న పరిస్థితుల్లో అలాంటివి దూరమవుతున్నాయి. మంచి సినిమా ఎక్కడా వచ్చినా, ఎవరు చక్కగా నటించినా సెలెబ్రిటీలందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా కీర్తి సురేష్పై, ఆమె నటించిన పెంగ్విన్ చిత్రంపై రష్మిక మందాన్న ప్రశంసలు కురిపించింది.
కరోనా నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే కొందరు నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే పెంగ్విన్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. లాక్ డౌన్ తరువాత ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా పెంగ్విన్కు భారీగానే క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాపై భిన్న రకాలుగా టాక్ వచ్చినా కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఈ చిత్రాన్ని తాజాగా రష్మిక మందన్న వీక్షించింది. సినిమాను చూసిన వెంటనే రష్మిక తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'రాత్రి పెంగ్విన్ చూశాను.. ఈ సినిమాకు కీర్తీ సురేష్ కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా తల్లులందరికీ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు' అంటూ రష్మిక కీర్తి సురేష్పై ప్రశంసలు కురిపించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దీనిని నిర్మించారు.