Don't Miss!
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
‘పెంగ్విన్’ను వీక్షించిన రష్మీక.. కీర్తి సురేష్ను ఆకాశానికెత్తేసిన హీరోయిన్
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఇగోలు ఉంటాయని తెలిసిందే. ఓ హీరోనో హీరోయినో చేసిన సినిమా వేరొకరు ప్రశంసించడం అరుదుగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం మారుతన్న పరిస్థితుల్లో అలాంటివి దూరమవుతున్నాయి. మంచి సినిమా ఎక్కడా వచ్చినా, ఎవరు చక్కగా నటించినా సెలెబ్రిటీలందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా కీర్తి సురేష్పై, ఆమె నటించిన పెంగ్విన్ చిత్రంపై రష్మిక మందాన్న ప్రశంసలు కురిపించింది.
కరోనా నేపథ్యంలో థియేటర్లు ఓపెన్ కావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. అందుకే కొందరు నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే పెంగ్విన్ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్లో విడుదల చేశారు. లాక్ డౌన్ తరువాత ఓటీటీలో రిలీజైన పెద్ద సినిమాగా పెంగ్విన్కు భారీగానే క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాపై భిన్న రకాలుగా టాక్ వచ్చినా కీర్తి సురేష్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
ఇక ఈ చిత్రాన్ని తాజాగా రష్మిక మందన్న వీక్షించింది. సినిమాను చూసిన వెంటనే రష్మిక తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. 'రాత్రి పెంగ్విన్ చూశాను.. ఈ సినిమాకు కీర్తీ సురేష్ కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా తల్లులందరికీ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు' అంటూ రష్మిక కీర్తి సురేష్పై ప్రశంసలు కురిపించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దీనిని నిర్మించారు.