రష్మిక మందన్నకు యాక్సిండెంట్.. నేషనల్ క్రష్ పరిస్థితి ఎలా ఉందంటే?
పుష్ప మూవీతో ప్యాన్ ఇండియా స్టార్గానే కాకుండా నేషనల్ క్రష్గా పేరు సంపాదించుకొన్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో చాలా రోజులుగా ఆమె ఇన్స్టాగ్రామ్కు దూరంగా ఉంటూ కనిపించారు. అయితే అభిమానులు కంగారు పడటంతో అసలు విసయం చెప్పారు. తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టి..
నా అభిమానులందరూ బాగున్నారని అనుకొంటాను. కొద్ది రోజులుగా నేను మీకు దూరంగా ఉన్నాను. పబ్లిక్ కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాకు దూరంగా కూడా ఉన్నాను. అందుకు కారణం నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ కారణంగా నేను ఇంటికే పరిమితమయ్యారను అని రష్మిక మందన్న చెప్పారు.

మైనర్ యాక్సిడెంట్ తర్వాత డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. దాంతో నేను బయటకు రాలేని పరిస్థితి. ప్రస్తుతం కోలుకొన్నాను. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాను. ఇప్పుడు సూపర్ యాక్టివ్గా ఉన్నాను. నా పనులు నేనే డీల్ చేసుకొంటున్నాను అని చెప్పగానే ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
మీరు కూడా లైఫ్ను జాగ్రత్తగా చూసుకోండి. జీవితం చాలా సున్నితమైంది. ఎప్పుడు ఏమౌతుందో అవుతుందో చెప్పలేను. కాబట్టి ప్రతీ రోజు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి అంటూ ఆమె సలహా ఇచ్చారు. ఈ మద్య కాలంలో బాగా లడ్డూలు తింటున్నాను అని ఆమె చెప్పారు.

ఇదిలా ఉండగా, యాక్సిడెంట్ తర్వాత మహారాష్ట్రలో జరిగిన గణేష్ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె రాకతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ఆమె తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తీరుకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా, రష్మి మందన్న నటించిన పుష్ప 2 సినిమా ఇప్పటికే రిలీజ్ అయి ఉండాల్సింది. సాంకేతిక కారణాల వల్ల అల్లు అర్జున్తో కలిసి నటించిన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











