Don't Miss!
- News టిప్పర్ నడుపుకుంటూ వెళ్లి మరీ నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కిస్ అంటేనే భయమేస్తోంది.. రొమాన్స్ చేయకుండా ఉంటేనే బెటర్.. రెజీనా షాకింగ్ కామెంట్స్
హాట్ అండ్ క్యూట్ హీరోయిన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ రెజీనా కసండ్రా. ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. కరోనా టైమ్ లో జనాల దృష్టి తనపై పడటం లేదు అనుకుంటుందో ఏమో గాని.. ఎవరు ఉహీంచని కామెంట్స్ చేస్తూ జనాలను తనవైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల ముద్దంటే భయం అంటూ మరో షాకింగ్ కామెంట్ చేసింది.
Recommended Video
ఆ సినిమాల్లో లిప్ లాక్స్..
ఇదివరకే రెండు మూడు సినిమాల్లో రెజీనా లిప్ లాక్స్ తో దర్శనమిచ్చింది. రవితేజ పవర్ సినిమాలోనే కాకుండా యువ హీరో సందీప్ కిషన్ రారా..క్తిష్ణయ్య సినిమాలో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అందుకు ఏ మాత్రం ఒప్పుకొను అంటోంది ఈ హాట్ బ్యూటీ. అంతే కాకుండా వీలైనంత వరకు రొమాన్స్ డోస్ తగ్గిస్తేనే బెటర్ అంటోంది.
అందుకు కారణం.. కరోనా..
రెజీనా ఇలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్ విజృంభన ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అందుకే కిస్ సీన్స్ అంటేనే భయం వేస్తోందని రెజీనా చెబుతోంది. అంతే కాకుండా కౌగిలింత సీన్లకు కూడా దూరంగా ఉంటేనే బెటర్ అని వివరణ ఇచ్చింది. రెజీనా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముద్దుపెట్టాలని చూశారు..
కొన్నిరోజుల క్రితం రెజీనా చేసిన ఒక కామెంట్ కూడా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. తన కాలేజ్ డేస్ ని గుర్తు చేసుకున్న ఈ బ్యూటీ చేదు అనుభవాల గురించి కూడా బయటపెట్టింది. కొందరు యువకులు తనను తాకరని చోట టచ్ చేశారని.. అలాగే పెదవులపై ముద్దు కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్లు రెజీనా వివరణ ఇచ్చింది.
ఆ సినిమాతో యూ టర్న్..
ఇక ఈ బ్యూటీ గత ఏడాది ఎవరు సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు చేసిన తెలుగు సినిమాలు అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో కొన్నాళ్ళు కమర్షియల్ సినిమాలను పక్కనెట్టి క్యారెక్టర్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలను చేయాలని డిసైడ్ అయ్యింది. అనుకున్నట్టుగానే ఎవరు సినిమాలో ఆమె చేసిన పాత్రకు మంచి క్రేజ్ దక్కింది. ప్రస్తుతం తమిళ్ తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంటోంది.