Don't Miss!
- News పవన్ కల్యాణ్ దూకుడు - తాజా నిర్ణయంతో..!!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఇష్టమైన కార్లను అమ్మేసిన రేణుదేశాయ్.. ఏదో ఒకరోజు నగరాన్ని వీడి..
టాలీవుడ్ నటి, పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనకు ఇష్టమైన రెండు కార్లను కష్టమైన పరిస్థితుల్లో అమ్మినట్టు వెల్లడించారు. తనకు సంబంధించిన ఆడీ, పోర్చే బాక్ట్సర్ కార్లను అమ్మినట్టు స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. పర్యావరణానికి హాని కలిగించే కార్బన్ను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాను అని తెలిపారు.
మారిషస్లో పర్యావరణానికి పలు కార్లు కార్బన్ వాయువులు హాని కలిగిస్తున్నాయనే విషయం నాకు ఆందోళన కలిగించింది. నా కార్ల ఉపయోగం వల్ల సమాజానికి, పర్యావరణానికి ముప్పు వాటిల్ల వద్దని నిర్ణయించుకొన్నాను. నాకు అత్యంత ఇష్టమైన ఆడి ఏ6, పోర్చే బక్ట్సర్ కార్లను అమ్మడం నాకు భావోద్వేగమైన అంశమైనప్పటికీ చాలా ఇబ్బందిని కలిగించింది అని అన్నారు.
ఏదో రోజు ఈ నగరాన్ని వదిలి శివారులోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఫామ్హౌస్కు వెళ్తాను. ఈ భూమికి హాని కలిగించే వస్తువులు వాడకూడదనే నిర్ణయం తీసుకొన్నాను. ఇప్పటికే చేసిన నష్టాన్ని పూడ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతీ నెల నా కార్లకు పెట్రోల్, డిజీల్ కోసం 15 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగిస్తే 800 కంటే ఎక్కువ ఖర్చు కాదనే విషయం తెలుసుకొన్నాను అని రేణు దేశాయ్ చెప్పారు.