Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
RGV హీరోయిన్ మళ్లీ సినిమాల్లోకి.. 12 ఏళ్ల తర్వాత నటనపై మోజు!
రంగీలా చిత్రంలో తన గ్లామర్తో దేశవ్యాప్తంగా యూత్ను ఆకట్టుకొన్న ఊర్మిలా మతోంద్కర్ మళ్లీ వెండితెరపైన మెరిసేందుకు సిద్ధమయ్యారు. గత కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉండి.. రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యూటీ మళ్లీ 12 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకొని తన అభిమానులను ఆకట్టుకొనేందుకు సిద్దమయ్యారు.
2018 వరకు బాలీవుడ్లో ఊర్మిల ప్యార్ తూనే క్యా కియా, లజ్జ, జుదాయి చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. ఆమె ఇర్ఫాన్ ఖాన్తో బ్లాక్మెయిల్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు.
ఇటీవల తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడుతూ.. త్వరలోనే మళ్లీ సినిమాల్లో నటించాలని అనుకొంటున్నాను. నా ఫ్యాన్స్కు శుభవార్తను త్వరలోనే చెబుతాను. మళ్లీ సినిమాల్లోకి రావడమనే విషయం నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అని ఊర్మిల తెలిపారు.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన పలు తెలుగు, హిందీ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. వర్మతో కలిసి చాలా కాలం ట్రావెల్ అయ్యారు. ఆ తర్వాత సినిమా కోసం వారిద్దరూ కలిసిన దాఖలాలు లేవు.