Don't Miss!
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
రియా చక్రవర్తికి కోర్టు మరో షాక్.. సెప్టెంబర్ 29 వరకు నిరీక్షణే
డ్రగ్ కేసులో అరెస్టైన తనకు బెయిల్ ఇవ్వాలంటూ బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్ను గురువారం బాంబే హైకోర్టు విచారించింది. అయితే ముంబైని భారీ వర్షాలు ముంచెత్తినందున పిటిషన్పై నిర్ణయం తీసుకోలేమని, బెయిల్ పిటిషన్పై తీర్పును సెప్టెంబర్ 29వ తేదీకి వాయిదా వేసింది. దాంతో సెప్టెంబర్ 29 వరకు రియా బెయిల్ కోసం బైకుల్లా జైలులోనే నిరీక్షించాల్సి వస్తున్నది.
బెయిల్ కోసం పలుమార్లు పిటిషన్ దాఖలు చేయగా ప్రత్యేక కోర్టు రెండుసార్లు తిరస్కరించిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరిస్తూ అక్టోబర్ 6వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా రియా విచారణ జరగడం లేదు. ఆమెను విచారించేటప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉండాలనే నిబంధనను పాటించడం లేదు. వాస్తవానికి ఎన్సీబీ విచారణ చట్ట వ్యతిరేకం అని 47 పేజీలతో కూడిన బెయిల్ పిటిషన్లో ఆమె తరఫు న్యాయవాది సతీష్ మాన్షిండే పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, రియా చక్రవర్తిని విచారించగా వెల్లడించిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్కు సమన్లు జారీ చేశారు. రియా మేనేజర్ జయ సాహా వాట్సాప్ ఛాట్ ఆధారంగా సారా ఆలీ ఖాన్, దీపిక పదుకోన్, శ్రద్దాకపూర్కు కూడా సమన్లు జారీ చేసి విచారణకు పిలువడం సంచలనంగా మారింది.