Don't Miss!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రియా చక్రవర్తి డ్రగ్స్ దందాలో మరో కోణం.. తల్లి మొబైల్ ఫోన్తో
బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ తర్వాత కూడా డ్రగ్స్ దందా గురించిన విషయాలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. డ్రగ్స్ సప్లయిర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొనేవారని, వివరాలు బయటకు పొక్కకుండా ఫోన్లను తరచుగా మార్చుతుండే వారనే విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా రియా చక్రవర్తి డ్రగ్స్ వ్యవహారాల్లో మరో కొత్త విషయం అధికారులు దృష్టికి వచ్చింది.
డ్రగ్స్ సరఫరా, నిల్వ చేసుకొనే విషయంలో తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ను ఉపయోగించే వారని, ఆమె ఫోన్ నుంచి డ్రగ్స్ సప్లయర్లకు సందేశాలు పంపే వారనే విషయాన్ని అధికారులు గుర్తించారు. రియా తల్లి ఫోన్ను స్వాధీనం చేసుకొన్న ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్ నుంచి డేటాను బయటకు తీశారు. ఈడీ అధికారులు విచారించిన సమయంలో తన తల్లి ఫోన్ను ఇవ్వడానికి నిరాకరించారనే విషయాన్ని ఎన్సీబీ అధికారులు తెలిపారు.
అరెస్ట్ ముందు రియా ఇంట్లో జరిపిన సోదాల్లో తల్లి ఫోన్ను స్వాధీనం చేసుకొన్నారని, ఆమె ఈ ఫోన్ నుంచే స్నేహితులు, ఇతర కార్యకలాపాలకు ఉపయోగించుకొనేదని అధికారులు పేర్కొంటున్నారు. తన తల్లి ఫోన్లోనే రకరకాల వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసిందనే విషయం తాజాగా ఎన్సీబీ అధికారుల దృష్టిలోకి వచ్చింది.
వాట్సప్ చాట్ల వల్లనే రియా డ్రగ్స్ రాకెట్ లింకులు బయటపడ్డాయి. జయ సాహా, శృతి మోడీ, శ్యామ్యూల్ మిరాండ, గౌరవ్ ఆర్యతో జరిపిన ఛాటింగులతోనే అనేక విషయాలు బయటకు వచ్చాయనే విషయం తెలిసిందే.