Don't Miss!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇంకో బిడ్డకు జన్మనిచ్చే అర్హత లేదు..అలాంటి రోజు రాకూడదు.. సాయి పల్లవి ఎమోషనల్
రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు కరోనా వైరస్ మానవాళిని పట్టి పీడిస్తూ ఉన్న మనుషులు తమలోని మృగాన్ని మాత్రం తట్టిలేపుతూనే ఉన్నారు. ఆసిఫా లాంటి ఘటన తమిళనాడులో జరగడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల చిన్న పిల్లపై దారుణానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. వారిని కఠినంగా శిక్షించాలని సమాజం గొంతెత్తి అరుస్తోంది. తాజాగా సాయి పల్లవి ఈ దారుణ ఘటనపై ఎంతో ఆవేదన చెందింది.
ఏడేళ్ల బాలికపై..
తమిళనాడులో పుదుకొట్టాయ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. ఆపై ఆ బాలిక చంపేశారు. ఈ ఘటనపై తమిళ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్తో న్యాయ పోరాటం చేస్తున్నారు.
క్రూరత్వాన్ని సంతృప్తి..
ఇలాంటి దారుణ ఘటనపై సాయి పల్లవి స్పందిస్తూ.. మానవ జాతిపై ఉన్న ఆశ వేగంగా చచ్చిపోతోంది. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినయోగం చేస్తాము.. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిపై మన అధికారాన్ని చూపిస్తాము.. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతాము.
ప్రపంచానికి అర్హత లేదు..
ప్రతి రోజు గడిచేకొద్దీ ప్రకృతి మనకొక సందేశాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోంది.. మన జాతిని పూర్తిగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి దారుణ ఘటనలు చూడానికి అలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాము.. మనం దేనికీ పని రాకుండా ఉండిపోయాం. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు.
అలాంటి రోజు రాకూడదు..
నేరం
వెలుగులోకి
వచ్చినప్పుడు
లేదా
సోషల్
మీడియాలో
ట్రెండ్
అయినప్పుడు
మాత్రమే
న్యాయం
జరిగే
రోజు
రాకూడదని
నేను
ప్రార్థిస్తున్నాను.
గుర్తించబడని
మరియు
రిపోర్ట్
చేయలేని
నేరాల
విషయంలో
ఏం
జరుగుతోంద'ని
ప్రశ్నించింది.
Recommended Video
గుర్తు పట్టేందుకు హ్యాష్ ట్యాగ్
ప్రతీ
చోట
ఇలాంటి
దారుణాలు
జరుగుతున్నందున
కచ్చితంగా
గుర్తు
పట్టేందుకు
హ్యాష్
ట్యాగ్లు
పెట్టాల్సి
వస్తోందని
సెటైర్స్
వేసింది.
చివరగా
ఈ
ఆవేదనం
అంతా
ఏడేళ్ల
బాలికకు
జరిగిన
ఘటనపై
అని
చెప్పడానికి
#JusticeforJayapriya
అనే
హ్యాష్
ట్యాగ్ను
జోడించింది.