Don't Miss!
- Sports IPL 2024: హార్దిక్.. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకోమనేది!వీడియో
- News YS Jagan పై వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎంతో మంది వద్దన్నారు.. అయినా దర్శకుడి మాటలు నమ్మేస్తున్న సాయి పల్లవి!
సౌత్ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా సాయి పల్లవికి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా ఫిదా బ్యూటీకి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఒక పాత్ర ప్రయోగాత్మకంగా ఉందంటే చాలు దర్శకులు మరో ఆలోచన లేకుండా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఆఫర్ అయినా సరే సాయి పల్లవి రిజెక్ట్ చేయాల్సిందే గాని ఆమె డేట్స్ ఇస్తే వద్దనే వారు ఉండరు.
రీసెంట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఒక దర్శకుడి నమ్మి సాయి పల్లవి మోసపోతోందట. స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడు కొత్తగా ఆలోచించే ఈ కేరళ కుట్టి ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. RX100 దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ మహా సముద్రం అనే ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కోసం దర్శకుడు చాలా మంది హీరో హీరోయిన్స్ ని కలిశాడు.
మొదట్లో అందరూ ఇంట్రెస్ట్ చూపినవారే అయినప్పటికీ ఆ తరువాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే తప్పుకున్నారు. ఇక ఫైనల్ గా హీరోగా శర్వానంద్ సెలెక్ట్ అవ్వగా హీరోయిన్ కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. సమంత, తమన్నా, లావణ్య త్రిపాఠి వంటి వారు ఆ క్యారెక్టర్ అంతగా బాలేదని కెరీర్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చేయమని చెప్పేశారట. కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పకుండా దర్శకుడి మాటలు నమ్మేసి గుడ్డిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.