Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పవన్ రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రౌడీ బేబీ
సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్గా రూపొందుతోందీ మూవీ. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని చిత్రాలను లైన్లో పెట్టేశాడీ స్టార్ హీరో. వీటిలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంతో పాటు హరీశ్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. వీటితో పాటు మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ కూడా చేస్తున్నారు.
'వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసం స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయింది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ తెరపైకి వచ్చింది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో మరో హీరో పాత్ర కోసం రానా, గోపీచంద్ సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఎప్పటి నుంచో ప్రచారం అవుతోన్నట్లే ఇందులో సాయి పల్లవి నటిస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమానే కాదు.. పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. హీరోయిన్లంతా పవర్ స్టార్ సినిమాలో ఒక్క చాన్స్ అయినా రావాలని చూస్తున్న వేళ.. రౌడీ బేబీ ఏకంగా రెండు సినిమాలు చేస్తుందన్న న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.