ఆర్మీ జవాన్ ను మ్యారేజ్ చేసుకోను.. కానీ..పెళ్లిపై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
ఈ మధ్య కాలంలోనే కాదు గతంలో కూడా మన సౌత్ కి చేసిన హీరోయిన్స్ ని సోషల్ మీడియాలో నార్త్ ఆడియెన్స్ టార్గెట్ చేసిన దాఖలాలు పెద్దగా కనిపించవు. కానీ మొదటిసారి ఓ హీరోయిన్ షాకింగ్ అంశాలు చోటు చేసుకున్నాయి. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు తన నాచురాలిటీ, వెర్సటాలిటీతో ఎంతో ఆదరణ అందుకున్న హీరోయిన్ సాయి పల్లవి అని చెప్పాలి.
కాగా సాయి పల్లవి ఇపుడు వరుస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉంది. సరే ఇది బాగానే ఉంది కానీ ఈమె నటిస్తున్న ప్రస్తుత సినిమాలు కాకుండా ఎపుడో పాత సినిమా తాలుకా ఇంటర్వ్యూలో ఓ పర్టిక్యులర్ క్లిప్ ని తీసుకొచ్చి వైరల్ చేసి ఆమెని కాంట్రవర్సీలోకి లాగడం షాకింగ్ గా మారింది. కాగా ఎపుడు కాంట్రవర్సీలకి చాలా దూరంగా ఉండే సాయి పల్లవి ఇలాంటివి ఎదుర్కోవడం వైరల్ గా మారగా ఈ అంశంపై అయితే ఆమె ఎక్కడా నేరుగా స్పందించలేదు.

ఇలా తన సినిమా పనుల్లో బిజీగా ఉండగా ఈమె లేటెస్ట్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అయితే తన పెళ్లి కోసం ఓపెన్ అయ్యింది. ఆమె రీసెంట్ గా భారత ఆర్మీ పట్ల చేసిన కామెంట్స్ క్లిప్స్ వైరల్ గా మారడం ఇదే క్రమంలో ఆమె నటించిన తాజా సినిమా అమరన్ కూడా భారత ఆర్మీ నేపథ్యంలోనే కావడం యాదృచ్చికంగా కనిపిస్తున్నాయి.
సరే ఇదిలా ఉండగా ఆమెకి మళ్ళీ నేపథ్యంలోనే పెళ్లి ప్రశ్న ఎదురైంది. తనకి తన తండ్రి ఓ ఆర్మీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని అడిగితే సమాధానం ఏంటి అని ఎదురు కాగా సాయి పల్లవి దీనికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తనకి ఆర్మీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అంత ఇష్టం లేదు అన్నట్టుగానే సమాధానం ఇచ్చింది.

కానీ తనకి ఆ రంగానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొవడం కంటే అందులోనే ఉండి వైద్య పరంగా సేవలు అందించిండం ఇష్టం అని ఆమె తెలిపింది. అలాగే తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని అసలు విషయం చెప్పింది. సో తనకి పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడు లేకపోయినా కూడా ఆర్మీకి సంబంధించిన వారిని చేసుకోవడంపై మాత్రం అంత సుముఖంగా కూడా లేదు అని చెప్పొచ్చు.
ఇక సాయి పల్లవి ఈ అమరన్ సినిమా కాకుండా తెలుగులో అక్కినేని వారి హీరో అక్కినేని నాగ చైతన్యతో భారీ పాన్ ఇండియా సినిమా తండేల్ లో కూడా నటిస్తుంది. అలాగే ఈమె నాగ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా తర్వాత రెండోసారి జత కట్టింది. ఈ సినిమా విడుదలపై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చగా నడుస్తుంది. అలాగే బాలీవుడ్ లో భారీ సినిమా రామాయణం లో కూడా సాయి పల్లవి నటిస్తుండగా ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తుండగా నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











