Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి.. అది మన బాధ్యత.. సాయి పల్లవి కామెంట్స్
మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు, వారి భద్రతకు గానూ హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్ను ప్రారంభించారు. షీ ఎమ్ పవర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలీసు విభాగం.. షీ సేఫ్ అనే యాప్ను ప్రారంభించారు. ఈ ఈవెంట్లో సాయి పల్లవి తన స్పీచ్తో అందరి మనసులను గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఏం మాట్లాడిన విషయాలేంటో ఓ సారి చూద్దాం.
గర్వంగా ఉంది..
ఇక్కడి
రావడం,
ఈ
కార్యక్రమంలో
పాల్గొనడం
చాలా
సంతోషంగా,
గర్వంగా
ఉందని
చెప్పుకొచ్చింది.
తానేం
సాధించానో
తెలీదు
కానీ
ఇక్కడ
ఇలా
అందరి
మధ్య
ఉన్నందుకు
ఈ
ఈవెంట్లో
పాల్గొన్నందుకు
చాలా
ఆనందంగా
ఉందని
తెలిపింది.
ప్రత్యేకమైన యాప్..
మహిళల రక్షణార్థం హైద్రాబాద్ పోలీసులు ఓ ప్రత్యేకమైన యాప్ను క్రియేట్ చేశారని చెప్పుకొచ్చింది. అది చాలా సంతోషకరమైన విషయమని తెలిపింది. మహిళలకు చేదు ఘటనలు ఎదురైతే బయటకు చెప్పుకోవడానికి రెండు కారణాలుంటాయని పేర్కొంది.
వేరే వారికి జరగకూడదని..
ఎవరికైనా
చేదు
అనుభవాలు
ఎదురైతే..
మరొకరికి
అలాంటి
ఘటనలు
జరగకూడదని
బయటకు
చెబుతుందని
తెలిపింది.
లేదా
తన
బాధను
కొంతైన
తగ్గించుకోవడానికి
తన
స్నేహితులతోనో,
ఇంట్లో
వారితోనో,
భర్తతోనో
చెప్పుకుంటుందని
పేర్కొంది.
మార్పు ఇంట్లోనే మొదలవ్వాలి..
మహిళలపై
ప్రమాదాలను
అరికట్టాలంటే
క్రమశిక్షణ
నేర్పాలని,
అది
మన
ఇంటి
నుంచే
మొదలవ్వాలని
పిలుపు
నిచ్చింది.
సమాజంలో
జరిగే
వాటికి
పోలీసులనో,
ఇంకెవరినో
దూషించడం
కన్నా..
మహిళలను
ఎలా
చూడాలి,
ఎలా
గౌరవించాలన్న
విషయాన్ని
ఇంట్లోనే
నేర్పించాలని
చెప్పుకొచ్చింది.
Recommended Video
అది మన బాధ్యత..
పిల్లలు
ఏం
చేస్తున్నారని
చూడటం,
మంచి
విషయాలు
నేర్పడం
అందరి
బాధ్యత
అని
తెలిపింది.
ఇంట్లో
మీరు
భార్యను
ఎలా
చూస్తారో..
మీ
పిల్లలు
కూడా
బయట
అలానే
చేస్తారు..
మీరు
ఎలా
ప్రవర్తిస్తారో
పిల్లలు
కూడా
అలానే
ప్రవర్తిస్తారని
చెప్పుకొచ్చింది.
పిల్లలు
ఏదో
అవుతారని
కలలు
కంటారు
కదా..
అవి
నెరవేరకపోయినా
పర్లేదు
కానీ
సమాజానికి
హాని
చేయకుండా
ఉండేట్టు
పిల్లల్ని
పెంచాల్సిన
బాధ్యత
అందరిపైనా
ఉందని
చెప్పుకొచ్చింది.
సాయి
పల్లవి
ప్రస్తుతం
విరాట
పర్వం,
లవ్
స్టోరీ
అనే
చిత్రాల్లో
నటిస్తూ
బిజీగా
ఉంది.