Don't Miss!
- Sports SRH vs RCB: ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ప్యాట్ కమిన్స్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలెంటెడ్ డైరెక్టర్తో సమంత సినిమా: భయపెట్టిన తర్వాత మొదలెడతాడట
తెలుగులో ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో టాప్ పొజిషన్లో వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. 'ఏమాయ చేశావే' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. చాలా తక్కువ కాలంలోనే తన టాలెంట్ను నిరూపించుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలను అందుకుని సత్తా చాటింది. అయితే, ఇటీవల వచ్చిన 'జాను' మాత్రం ఆమెను బాగా నిరాశ పరచడంతో పాటు విజయపరంపరకు బ్రేకిచ్చింది. దీని తర్వాత సామ్ మరో సినిమాను ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం.. సమంత ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. 'అ!', 'కల్కి' వంటి వినూత్న చిత్రాలను తెరకెక్కించి, 'జాంబీ రెడ్డి'తో సరికొత్త ప్రయోగం చేయబోతున్న ప్రశాంత్ వర్మతో ఆమె సినిమా చేయబోతుందట. ఇటీవల సామ్ను కలిసిన సమయంలో అతడు ఓ స్టోరీ లైన్ చెప్పాడట. దానికి బాగా ఇంప్రెస్ అయిన ఈ స్టార్ హీరోయిన్.. వెంటనే ఓకే చెప్పేసిందట. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఇది తెరకెక్కనుందని అంటున్నారు. తన గత చిత్రాల మాదిరిగానే దీన్ని కూడా వినూత్నంగా రూపొందించబోతున్నాడట ప్రశాంత్ వర్మ.
ఇదిలా ఉండగా, ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'జాంబీ రెడ్డి'. తేజ సజ్జా, దక్ష, ఆనంది ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను యాపిల్ ట్రీ బ్యానర్పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు. తెలుగులోనే మొదటి జాంబీ ఫిల్మ్గా రాబోతున్న ఈ సినిమాను కరోనా వైరస్ నేపథ్యంతో తెరకెక్కించారు. తాజాగా అక్కినేని సమంత చేతుల మీదుగా విడుదలైన 'జాంబీ రెడ్డి' ఫస్ట్ బైట్ వీడియోకు భారీ స్థాయిలో స్పందన వస్తోంది. అంతేకాదు, దీనితో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీని తర్వాత సామ్ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని టాక్.