Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చూపుల్తోనే గుచ్చి చంపేస్తోంది.. సమంత వైరల్ పిక్స్
సమంత సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. అభిమానులతో టచ్లో ఉంటూ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. నెటిజన్లు వేసే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ.. ట్రోల్స్కు తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఈ మధ్యే సమంత కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది. తన ఎన్నో యేళ్ల కల అని బిడ్డ లాంటిదని చెబుతూ ఎమోషనల్ అయింది. సొంతంగా ఫ్యాషన్ బ్రాండ్లు ఉండాలని సాకీ వరల్డ్ అనే పేరుతో ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టబోతోంది.
ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతో తాను జీవితంలో పడిన కష్టాలను వివరించింది సమంత. ఈ లాక్ డౌన్ సమయంలో, క్లిష్ట పరిస్థితిలోనూ ఎంతో కష్టపడ్డట్టు చివరకు సాకీని మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్టు తెలిపింది. ఈ మధ్య సమంతకు సోషల్ మీడియాలో కొత్త రికార్డులు నెలకొల్పడం అలవాటైపోయింది. గత నెలలో ఇన్ స్టాగ్రాంలో పది మిలియన్లు, పదకొండు మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారని ఎంతో సంతోషంగా తెలిపింది.
నేడు ఆ సంఖ్య 12 మిలియన్లకు చేరుకుంది. ఈ క్రమంలో సమంత ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ మేరకు అదిరిపోయే ఫోటోను షేర్ చేసింది. కళ్లతోనే ఏదో మాయ చేసేట్టు, ఆ చూపులతో గుచ్చి చంపేసేట్టు చూస్తోంది. ఇన్ స్టాలో తన సైన్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆనందంలో తేలిపోతోంది. పన్నెండు మిలియన్లకు చేరుకోవడంతో సమంత సంతోషంలో మునిగింది. ఈ మేరకు పోస్ట్ చేస్తూ.. మీ ప్రేమ ఇప్పుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది. సమంత ఈ మధ్య ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ డబ్బింగ్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే.